Karimnagar

News April 16, 2024

జగిత్యాల: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉరేసుకొని మామిడి నర్సయ్య(34) మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. నర్సయ్య కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారని చెప్పారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరేసుకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు. నర్సయ్య భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 16, 2024

సివిల్స్‌ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ

image

సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కరీంనగర్‌ టౌన్‌లో ఇంటర్ వరకు చదివిన సహన.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుని తాజా ఫలితాల్లో ర్యాంకు సాధించారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్ టౌన్‌లో ఓ పత్రిక రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.

News April 16, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన కరీంనగర్ కుర్రాడు

image

నేడు ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన నందల  సాయి కిరణ్ సత్తాచాటారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించారు. ఈయన ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన్ను అభినందించారు.

News April 16, 2024

KNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు.. ఓడేడుకు చెందిన మొగిలి రమేష్ (45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటారు వేయడానికి ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మానేరులో కింద పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 16, 2024

KNR: గుండెపోటుతో స్వర్ణకారుడు మృతి

image

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుంకోజు నరేష్ (29) అనే స్వర్ణకారుడు మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడిని చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

News April 16, 2024

KNR: పోలీస్ స్టేషన్ ఘటనపై పోలీస్ శాఖ చర్యలు.!

image

<<13057630>>మహాదేవపూర్ <<>>PSలో సోమవారం జరిగిన ఘటనపై పోలీస్ శాఖ తీవ్రచర్యలు చేపట్టింది. ఆ ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా SP కిరణ్ ఖరే.. SI ప్రసాద్‌ను VRకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలోని ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఆరుగురి సిబ్బందిపై బదిలి వేటు వేశారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.

News April 16, 2024

BREAKING.. KNR: స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి

image

స్కూల్ బస్సు కిందపడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అన్నను బస్సు ఎక్కించేందుకు వెళ్లిన చిన్నారి అలీఫా ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

సుల్తానాబాద్: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంట్ల తిరుపతి (40) PDPLలో ఓ హోటల్లో టిఫిన్ మాస్టారుగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తన భార్యతో గొడవ జరగగా ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 16, 2024

KNR: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల!

image

KNR కాంగ్రెస్‌ MP అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌ రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. MP టికెట్‌పై ఢిల్లీ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. మొదటి నుంచి ఆశావహుల జాబితాలో మాజీ MLA అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి, వెలిచాల ఉన్నారు. వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అధిష్ఠానం వెలిచాల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.

News April 16, 2024

KNR: ఆన్ లైన్‌లో రాములవారి తలంబ్రాలు

image

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.