Karimnagar

News April 15, 2024

19న పెద్దపల్లికి కేటీఆర్!

image

రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 19న పెద్దపల్లి పార్లమెంట్ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కోసం ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు KTR పెద్దపల్లికి వస్తున్నట్లు ప్రకటించారు.

News April 15, 2024

హనుమకొండలో అమానుష ఘటన

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాలపురం చెరువులో సోమవారం పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మగశిశువు మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

KNR: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.

News April 15, 2024

ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం: మందకృష్ణ

image

రాష్ట్రంలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో జరిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలల మాట వింటూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు.

News April 15, 2024

కాంగ్రెస్ నేతల దీక్షలు ఎన్నికల స్టంట్: బండి సంజయ్

image

మోదీ పాలనపై నిరసన పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్షలు ఎన్నికల స్టంట్ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌పై ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు.

News April 15, 2024

WOW.. కరీంనగర్: సీతమ్మకు త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

రామగుండం: రైలు కిందపడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి వివరాల ప్రకారం.. పట్టణంలోని భీమయ్య కాలనీకి చెందిన దండుగుల అంజి(29) ఆదివారం స్థానిక విద్యుత్ నగర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కుటుంబంలో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మృతుడి భార్యలావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

KNR: నిబంధనలు అతిక్రమించిన టీచర్ సస్పెండ్

image

నిబంధనలకు విరుద్ధంగా టెన్త్ మూల్యాంకన కేంద్రంలో ఫోన్ ఉపయోగించినందుకు ఓ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన KNR జిల్లాలో చోటుచేసుకుంది. ఈమేరకు మానకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, TPF జిల్లా అధ్యక్షుడు పి.దామోదరరెడ్డిని DEO జనార్దనరావు సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులను శనివారం రాత్రి ప్రధానోపాధ్యాయుడికి పంపినట్లు మూల్యాంకన కేంద్రం జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News April 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
➤కోనరావుపేట: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
➤ఓదెల: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
➤జగిత్యాలలో వైభవంగా పడిపూజ
➤మెట్పల్లి పట్టణంలో కిలోన్నర బంగారం, ఏడు లక్షల నగదు సీజ్
➤భీమారం మండలంలో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
➤సిరికొండలో వైభవంగా జింక మల్లన్న జాతర

News April 14, 2024

KNR: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని మనోవేదనకు గురై యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన కొంగర స్వప్న(29) పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఈనెల 12న పురుగుల మందు తాగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తన తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.