Karimnagar

News April 14, 2024

కరీంనగర్: రేపు గడువు చివరి తేదీ

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 14, 2024

సిరిసిల్ల: తాటి చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

image

తాటి చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది.  గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమారి దేవయ్య ముంజలు కోయడానికి ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు.  ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

నేడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News April 14, 2024

కరీంనగర్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
కేంద్రాల వివ‌రాలు:
క‌రీంన‌గ‌ర్‌: 80087 29397,
గోదావ‌రిఖ‌ని: 98663 51620,
సిరిసిల్ల: 94943 62362.

News April 14, 2024

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌పై కేసు నమోదు

image

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌పై మంథని పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న అంబేడ్కర్ కూడలిలో అనుమతి లేకుండా దీక్ష చేపట్టడంతో మధుకర్‌‌పై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు నోటీసులు జారీ చేశామన్నారు.

News April 13, 2024

ధర్మారం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో శనివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ కారులో ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయడిన వీరిని అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త మహేశ్ మృతి చెందాడు.

News April 13, 2024

HSNB: కొనుగోలు కేంద్రంలో కార్ల పార్కింగ్

image

హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ షెడ్‌లో కార్ల పార్కింగ్ చేస్తున్నారని తెలిసింది. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు షెడ్డులో ధాన్యం పోసుకుందామంటే షెడ్‌లో కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయని, మార్కెట్ సిబ్బంది తీరు చూస్తేనే వారి పనితీరు తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. కూతవేటు దూరంలో మంత్రి కార్యాలయం ఉండగా.. రైతులను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు.

News April 13, 2024

ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

image

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. గోదూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం వద్ద రూ.8,33,000 విలువ గల ప్రామిసరీ నోట్లను, బ్లాంక్ చెక్కులను, నోటుబుక్కులను, సత్యక్కపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్ వద్ద రూ.38,14,370 విలువ గల ప్రామిసరీ నోట్లు, నోటుబుక్కులు, నగదును సీజ్ చేసి కేసు చేశామన్నారు.

News April 13, 2024

గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం : వేములవాడ డీఎస్‌పీ

image

గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం మోపుతానని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి అన్నారు. శనివారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదుగురు గంజాయి నిందితులను అరెస్ట్ చేయగా వారి వద్ద రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని డిఎస్పి అన్నారు.

News April 13, 2024

నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం: మంత్రి

image

మంథని పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముందుగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు ఇచ్చిన హామీలలో నాలుగు గ్యాలరీలు అమలు చేస్తున్నామని వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తదితరులు ఉన్నారు.