Karimnagar

News April 13, 2024

వేములవాడలో గంజాయి కలకలం

image

ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి వేములవాడలో విక్రయిస్తున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిందితుల వద్ద 1,900 గ్రాముల గంజాయి, ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

News April 13, 2024

ముత్తారం: రోడ్డు ప్రమాదం.. ఎస్ఐకి తప్పిన ప్రమాదం

image

ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్ఐ మధుసూదన్ రావుకు ప్రమాదం తప్పింది. కేశనపల్లి గ్రామం వైపు ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును దాటించే క్రమంలో ఎదురుగా గోదావరిఖనికి కారులో వెళ్తున్న ఎస్ఐ వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ చూసి సడన్ బ్రేకు వేశారు. ఈ క్రమంలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

News April 13, 2024

రామగుండం: గోదావరిలో దూకి డిగ్రీ విద్యార్థిని సూసైడ్

image

GDK హనుమాన్ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని అర్షియా పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ CI రవీందర్ తెలిపారు. డిగ్రీ చదువుతున్న అర్షియా శుక్రవారం నదిలోకి దూకిందన్నారు. జాలర్లు గమనించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారని, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

జగిత్యాల: రెండు బైకులు ఢీ.. ఇద్దరి మృతి

image

శుక్రవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి ప్రధాన రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోరుట్లకు చెందిన వెంకటేశ్, మెట్‌పల్లికి చెందిన కాజా పాషా అనే ఇద్దరు మృతిచెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 13, 2024

కరీంనగర్: సంతకాల ఫోర్జరీ.. జూనియర్ అసిస్టెంట్, ఆమె భర్తపై కేసు

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు బిల్లులు సృష్టించిన జూనియర్ అసిస్టెంట్ తిరుమల, ఆమె భర్త రాజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చంద్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు పేర్కొన్నారు.

News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ భీమదేవరపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి. @ మెట్పల్లి మండలంలో 2 బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండల వాసి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్. @ బిజెపికి ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నా మంత్రి పొన్నం ప్రభాకర్. @ కరీంనగర్ లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాలలో చాయ్ పే చర్చలో పాల్గొన్న ఎంపీ అరవింద్

News April 12, 2024

విభజన హామీలు విస్మరించిన కేంద్ర ప్రభుత్వం: మంత్రి పొన్నం

image

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా.. తెలంగాణ విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఓటు అడిగే నైతికహక్కు బీజేపీకీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్నారే తప్పా.. ప్రజలకు ఏమి చేయలేదన్నారు.

News April 12, 2024

KNR: ఓటర్లను తిప్పుకుంటున్నారు!

image

ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో వివిధ పార్టీలు తమవ్యూహాలకు పదునుపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ (కొంతమేర) పార్లమెంటు స్థానాలున్నాయి. కరీంనగర్‌లో కాంగ్రెస్ మినహా అన్నిస్థానాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా సర్వేలు చేయించుకుంటున్నారు. వివిధ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారిని దగ్గర చేసుకుంటున్నారు.

News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.36.56 కోట్ల లబ్ధి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకొని వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33,471 స్వయం సహాయక సంఘాలకు రూ.36.56 కోట్ల లబ్ధి చేకూరింది. KNR రూ.11.34 కోట్లు, JGTL రూ.10.17 కోట్లు, SRCL రూ.8.23 కోట్లు, PDPL రూ.6.82 కోట్లు వడ్డీ జమ చేశారు.

News April 12, 2024

కరీంనగర్: 19న బండి సంజయ్ నామినేషన్

image

కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్‌లో నామినేషన్ వేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.