Karimnagar

News April 12, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.

News April 12, 2024

హుజూరాబాద్: పెరిగిన బస్సు ఛార్జీలు!

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 12, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ!

image

కరీంనగర్‌‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మినహా ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉత్కంఠ నెలకొంది.

News April 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల ప్రసూతి గదుల సీజ్.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
*మహదేవ్పూర్ మండలంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.
*మెట్ పల్లి పట్టణంలో చాయ్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్.
*తన జీవితం తెరిచిన పుస్తకమన్న మాజీ మంత్రి కొప్పుల 

News April 11, 2024

బండి సంజయ్ రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చారు: రాణి రుద్రమ

image

భారతదేశంలో అందరు ఎంపీల కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బండి సంజయ్ పై అత్యధిక కేసులు ఉన్నాయని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు ఎంపీ బండి సంజయ్ తీసుకువచ్చారని తెలిపారు.

News April 11, 2024

‘నా జీవితం తెరిచిన పుస్తకం’: మాజీ మంత్రి కొప్పుల

image

నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. నా ఆస్తులు లెక్కపెట్టడానికి గెలిచినవా? లేక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గెలిచినవా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

News April 11, 2024

కరీంనగర్: ఇంకా ఐదు రోజులే!

image

పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు నమోదు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండినవారిపై బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 15 లోపు నూతన ఓటు నమోదు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. 25న తుది జాబితా విడుదల చేయనున్నారు.

News April 11, 2024

KNR: 16 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ (హానర్స్) డిజైన్, టెక్నాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు గమనించాలని ఆయన తెలిపారు.

News April 11, 2024

నన్ను చంపేందుకు కుట్ర: పుట్ట మధు

image

తనను చంపేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 11, 2024

కరీంనగర్: నిబంధనలు పాటించని ఉపాధ్యాయుడి సస్పెండ్

image

కరీంనగర్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో నిబంధనలు పాటించని కరీంనగర్ సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ ఆర్. చంద్రశేఖర్ రావును సస్పెండ్ చేశారు. మూల్యాంకన విధుల్లో చరవాణి మాట్లాడుతున్నందుకు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ క్యాంపు ఆఫీసర్, డిఇఓ జనార్దన్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.