India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం మణిదీప్ (31) ప్రేమ విఫలమై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మణిదీప్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికి మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కరీంనగర్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 12న జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ఆనంతరెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారుల వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ చాటిన వారిని ఈనెల 21నుంచి 23వరకు జరిగే 8వ జూనియర్స్ అంతర్ జిల్లా టోర్నమెంట్కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 106 మంది ఈజీఎస్, ఐకెపీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కావున జిల్లాలోని ఉద్యోగులు పార్టీలపై పక్షపాతం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
* చీఫ్ సెక్రటరీ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. * పెగడపల్లి మండలంలో 400 గ్రాముల గంజాయి పట్టివేత. * మల్యాల మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య. * కొండగట్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల ఎస్పీ. * వేములవాడ రూరల్ మండలంలో ఎండ వేడి తాళలేక చేపల మృతి. * కొండగట్టు అంజన్న దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. * యూట్యూబ్ స్టార్ గంగవ్వకు సన్మానం.
మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 5న అంబదాస్ అనే వ్యక్తిని హత్య చేసిన కందెల రవితేజ (21) అనే యువకుడిని బుధవారం అరెస్టు చేసినట్లు డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు. తన తల్లితో మృతుడు సహజీవనం చేయడం ఇష్టం లేకపోవడంతో పాటు తన తల్లి సంపాదించే డబ్బులు వాడుకుంటున్నాడని, తన జల్సాలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో రవితేజ హత్యకు పాల్పడ్డాడని వివరించారు. సమావేశంలో సిఐ నవీన్, ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం జరిగింది. రామన్నపేట గ్రామానికి చెందిన వాకులాబరణం మణిదీప్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. మణిదీప్ మృతి పట్ల కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఛైర్మన్గా నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ వర్గాలు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశాయి. అశోక్ గౌడ్ నియామకం పట్ల స్థానిక న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు, బార్ అసోసియేషన్ వర్గాలు అభినందనలు తెలిపాయి.
మహిళలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో మహిళను వేధిస్తున్న పోకిరీలపై 5 కేసులు, 4 పెట్టి కేసులు నమోదు చేశామని చెప్పారు. లేడీస్ ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే 87126564425, 100కి ఫిర్యాదు చేయాలని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీట మూడి వీడటం లేదు. మరో 8 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.