Karimnagar

News April 9, 2024

పుష్ప2లోని ఓ సాంగ్‌లో మల్యాల యువకులు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన 15 మంది యువకులకు పుష్ప2 సినిమాలో పులి వేషం వేసే అవకాశం లభించింది. 45 రోజులపాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేపట్టిన ఓ సాంగ్ షూటింగ్‌లో యువకులు పులి వేషంలో పాల్గొన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా తాము గ్రామంలో వేసిన పులి వేషధారణను యూట్యూబ్‌లో పెట్టగా.. డైరెక్టర్ చూసి అవకాశం ఇచ్చినట్లు సంపత్ అనే యువకుడు తెలిపాడు.

News April 9, 2024

నేటి నుంచి కరీంనగర్‌కు ముంబై రైలు

image

ఉగాది పర్వదినం సందర్భంగా సెంట్రల్ రైల్వే ముంబైలోని CSMT (చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్) నుంచి కరీంనగర్‌కు వీక్లీ ఎక్స్ ప్రెస్‌ను నేటి నుంచి నడపనున్నారు. CSMT నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 గం.కు బయలుదేరి బుధవారం ఉదయం 8:30 గం.కు కరీంనగర్ చేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 7:05 గంటలకు KNR నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:40 గంటలకు ముంబై చేరుకుంటుంది.

News April 9, 2024

GDK: గృహిణి హత్య కేసులో భర్త, అత్తకు జీవిత ఖైదు

image

GDK LBనగర్‌కు చెందిన గౌతమి, హనుమాన్‌ నగర్‌కు చెందిన రాజుకు 2009 వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత రాజు, అతని తల్లి వరకట్నం తేవాలని వేధింవారు. ఈక్రమంలో 2014 AUG 9న గొంతు నులిమి హత్య చేసి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్‌లో కేసు నమోదు చేశారు. సోమవారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీనివాసరావు భర్త, అత్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

News April 9, 2024

ధర్మారం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

image

ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపేటకు చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్‌ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.

News April 9, 2024

ధర్మారం: వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

ధర్మారం మండలంలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా తాత వరుసైన వృద్ధుడు తన నివాసంలోకి తీసుకెళ్లాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అతడిని మందలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

News April 9, 2024

హుజూరాబాద్: రోడ్డు ప్రమాదంలో RMP డాక్టర్ మృతి

image

జమ్మికుంట ఫోర్లేన్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో HNK జిల్లా పెంచికల్ పేటకు చెందిన RMP డాక్టర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీందర్, ఇందిరానగర్ కాలనీకి చెందిన అంజన్ కుమార్‌లు ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా ఢీకొన్నారు. గమనించిన స్థానికులు ఇద్దిరినీ హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీందర మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదైంది.

News April 9, 2024

గంభీరావుపేట: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలను సస్పెండ్ చేశారు. పాఠశాలల కార్యదర్శి సీతాలక్ష్మీ ఆదేశాల మేరకు ఆర్సీఓ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 5న పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న యశస్విని తల్లిదండ్రుల ముందు ప్రిన్సిపల్ కొట్టడంతో నిర్మలను సస్పెండ్ చేసినట్లు ఆర్సీఓ తెలిపారు.

News April 9, 2024

జగిత్యాల జిల్లా వాసి సౌదీలో గుండెపోటుతో మృతి

image

ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన నిమ్మ రాజశేఖర్(36) సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 3న తను ఉంటున్న గదిలో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 9, 2024

జగిత్యాల: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజి రంగనాథ్ సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదే ఆరోపణలతో ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

News April 9, 2024

సిరిసిల్ల: ఎంట్రెన్స్ రాయకున్నా పాలిటెక్నిక్‌లో ఉచిత సీటు

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ HYDలో ప్రవేశానికై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయకున్నా కేవలం 10వ తరగతి చదివిన అర్హులన్నారు. ఆసక్తి గలవారు మే15లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.