India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*మాట నిలబెట్టుకున్న KTR
*బండి సంజయ్పై మంత్రి పొన్నం ఫైర్ (VIDEO)
*100% సిజేరియన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
*కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
*పెద్దపల్లి సమీపంలో లారీ, కారు ఢీ.. పలువురికి గాయాలు.
*మల్లాపూర్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ సస్పెండ్.
*సిరిసిల్ల: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్
*ఉగాది ఎఫెక్ట్: భారీగా పెరిగిన ధరలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు మెట్ల దారి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన మల్లయ్య(45)కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈరోజు కుటుంబ సభ్యులు కొండగట్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
పెద్దపల్లి సమీపంలోని బంధంపల్లి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గోదావరిఖనికి వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులోని పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉచిత శిక్షణకై ఎస్సీ అభ్యర్థులకు ఈనెల 10న స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. 100 సీట్లకు గాను.. 45 సీట్లు భర్తీ కాగా మిగిలిన 55 సీట్లకు సిరిసిల్ల చంద్రంపేటలోని ఎస్సి స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడునన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.
జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్ ధరూర్లో ఏప్రిల్, మే నెలలో సదరం శిబిరాలు నిర్వహించబడునని జిల్లా వైద్య పర్యవేక్షకులు తెలిపారు. ఏప్రిల్ 10, 18, 19, 24, 26, 30, మే 8, 15, 17, 22, 29, 31 తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించబడునున్నారు. ఏప్రిల్ 23, మే 24 తేదీలలో మాతా శిశు హాస్పిటల్లో శిబిరం నిర్వహించబడునన్నారు. ఈనెల 8 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.
ఈనెల 22 నుంచి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో TRనగర్కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని.. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.
విద్యార్థినిని ప్రిన్సిపల్ కొట్టిన ఘటన గంభీరావుపేట మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగింది. గ్రామానికి చెందిన ఎడ్ల యశస్విని పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కూతురుని చూద్దామని ఆదివారం తల్లిదండ్రులు పాఠశాలలోకి వెళ్లారు. ఈక్రమంలో భోజనం సరిగా లేదని యశస్విని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ తల్లిదండ్రుల ముందు బిడ్డను కొట్టినట్లు ఆరోపించారు.
ఫిట్స్తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడలో జరిగింది. ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులు స్థానికుల సమాచారంతో 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మరణించినట్లు వేములవాడ టౌన్ ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు వేములవాడ పోలీసులను సంప్రదించాలన్నారు.
@ మల్యాల మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ కోరుట్ల మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల పట్టివేత. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం కొండ్రికర్ల లో వైభవంగా మల్లన్న జాతర. @ కోనరావుపేట మండలంలో చెరువులో చేపల మృతి. @ జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జలపతి రెడ్డి.
Sorry, no posts matched your criteria.