Karimnagar

News April 3, 2024

జగిత్యాల: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె చెరువులో చోటుచేసుకుంది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగేంద్రనగర్‌కు చెందిన ఉమా మహేశ్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎడుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. మహేశ్ నీటిలో ముగినిపోగా.. మిగతా విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. గాలింపుల్లో బాలుడి మృతదేహం వలలో చిక్కింది.

News April 3, 2024

KNR కాంగ్రెస్ MP టికెట్‌పై ఉత్కంఠ!

image

KNR MPఅభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ అడుగులేస్తోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ KNR విషయంలో జాప్యం చేస్తోంది. ప్రజలతో సత్సంబంధాలతో పాటు.. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా.. మరో కొత్త అభ్యర్థిని సైతం వెతుకుతున్నట్లు సమాచారం.

News April 2, 2024

సీఎస్ శాంతి కుమారిని కలిసిన ఎమ్మెల్యేలు

image

రైతులను కాంగ్రెస్ సర్వం ముంచిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రైతులకు నష్టపరిహారం, వడ్ల బోనస్ అందజేయాలని బీఆర్ఎస్ నేతలతో వినతి పత్రం అందజేశారు. రైతుల పేరుతో మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.

News April 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ రూరల్ మండలంలో కల్తీకల్లు తాగి ఆరుగురికి అస్వస్థత. @ కరీంనగర్ లో కొడుకుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై కేసు. @ కథలాపూర్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ జగిత్యాలలో ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం. @ జగిత్యాల మండలంలో చెరువుల మునిగి బాలుడి మృతి

News April 2, 2024

వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రోజూరోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.

News April 2, 2024

కరీంనగర్: హత్యకు గురైన విద్యార్థి తల లభ్యం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి తల లభ్యమైంది. మార్చి 1న విద్యార్థి అదృశ్యం కాగా.. 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. బావిలో నీరు ఖాళీ చేయించి తలను వెలికితీశారు. ఘటనా స్థలంలోనే వైద్యాధికారులతో తలకు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ప్రిన్సిపల్ మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్స్- 5, అసోసియేట్ ప్రొఫెసర్స్- 17, అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 10, సీనియర్ రెసిడెంట్స్- 4, ట్యూటర్స్- 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి వైద్య కళాశాలలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News April 2, 2024

కరీంనగర్‌లో కొడుకుకి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

image

కరీంనగర్‌లో దారుణం జరిగింది. బొమ్మకల్‌కు చెందిన ఓ తల్లి శ్రీజ.. ఏడాదిన్నర వయసున్న కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసి శ్రీజ తల్లి జయప్రద విషం తాగింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

ఉష్ణోగ్రతల్లో రాష్ట్రంలోనే మల్లాపూర్ టాప్

image

జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మల్లాపూర్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.

News April 2, 2024

ఉమ్మడి KNR జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్ 

image

బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.