Karimnagar

News March 31, 2024

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం!

image

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News March 31, 2024

కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!

image

ఇందుర్తిలో శనివారం 41.7℃ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 40.6, గంగాధర 40.5, రేణికుంట 39.7, కొత్తపల్లి 39.7, బూర్గుపల్లి 39.3, కరీంనగర్ 39.2, వెంకేపల్లి 39.2, కొత్తగట్టు 39.1, ఆసిఫ్‌నగర్ 38.9, తనుగుల 38.8, వీణవంక 38.8, మల్యాల 38.6, గుండి 38.6, చిగురుమామిడి 38.5, ఏదులగట్టేపల్లి 38.4, ఆర్నకొండ 38.4, చింతకుంట 37.8, బోర్నపల్లి 37.7, వెదురుగట్టు 37.6, దుర్శేడ్ 37.1, గట్టుదుద్దెనపల్లిలో 37.1℃.

News March 31, 2024

KNR: ధాన్యం కొనుగోళ్ళలో ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మిల్లర్ల సమస్యలపై ఎఫ్సీఐ అధికారులతో సమీక్షిస్తానని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం రబీ కొనుగోలుపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా వ్యవహరించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News March 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.

News March 30, 2024

ధర్మారం: మనవడిపై తాత గొడ్డలి దాడి

image

ధర్మారం మండలం నంది మేడారంలో సామంతుల మహేష్ (28) శనివారం ఉదయం 1 గంట ప్రాంతంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమరయ్య (66) గొడ్డలితో ముఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

News March 30, 2024

సుల్తానాబాద్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ శాస్త్రీనగర్‌కు చెందిన పల్స శివసాయి(22) కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కారు నిర్వహణ కోసం 3 నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద రూ.70వేలు అప్పు చేశాడు. ఈనెల 27న అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి అప్పు తీర్చాలంటూ కారు తీసుకెళ్లాడు. మనస్తాపం చెందిన తను పురుగు మందు తాగాడు. MGMకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

News March 30, 2024

ఉమ్మడి KNR జిల్లాలో భానుడి భగభగ

image

ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రత 42.5℃గా నమోదైంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

News March 30, 2024

KNR: వడదెబ్బతో ఆశా వర్కర్ మృతి

image

వడదెబ్బతో ఓ ఆశా వర్కర్ కరీంగనర్ జిల్లాలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(50) ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా గురువారం ఎండలో ఇంటింటికి తిరుగుతుండగా ఎండకు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందారు.

News March 30, 2024

KNRలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ MLA

image

KNRలో BJPకి బిగ్ షాక్ తగిలింది. మానకొండూర్ మాజీ MLA ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BJPలో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం HYDలోని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. MP టికెట్ ఆయనకు కేటాయించనందుకే పార్టీ మారినట్లు సమాచారం.

News March 30, 2024

ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించుకుందాం: సీఎం

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిపిసిసి చీఫ్ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించాలని అందుకు కార్యాచరణ పై చర్చించారు. సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి, నిజామాబాద్ నేతలు పాల్గొన్నారు.

error: Content is protected !!