India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలు చెల్లించాలని సీఎంకు బండి సంజయ్ లేఖ.
*ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
*రాయికల్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య.
*జగిత్యాల ఎమ్మెల్యేకు పితృవియోగం.
*సోషల్ మీడియాపై పోలీస్ నజర్: ఎస్పి అఖిల్ మహాజన్.
*జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
*మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శుక్రవారం ఆలయం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో కాటారం సహా.. పలు చోట్ల ఆన్లైన్, ఆఫ్లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపక్ష పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అనే ఒకటే ఊదరగొడుతుండ్రు. ఇది శిశిర ఋతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. మళ్ళీ చైత్రం వస్తది, కొత్త ఆకులు చిగురిస్తాయని, మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయన్నారు. ఇది ప్రకృతి సహజం, ప్రతిదానికి షాకైతే ఎలా అని అన్నారు.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.
రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ వద్ద దర్శన్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న మధ్యాహ్నం లాడ్జింగ్కు వచ్చిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్లో ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఏఐసిసి అధిష్టానం మరో కీలక పదవిని అప్పజెప్పింది. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంత్రి శ్రీధర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అనుబంధ పార్టీ సెక్రటరీ జనక్ ప్రసాద్కు సభ్యుడుగా నియమిస్తే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక(శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, కోరారు. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరారు. గత 27 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సమ్మె విరమింపచేసేలా కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని పాడుబడ్డ కోళ్ల ఫారంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.