Karimnagar

News March 27, 2024

గంభీరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో పలు కంపెనీలు హాజరవుతున్నాయని, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.

News March 27, 2024

జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా!

image

జగిత్యాలలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం మత్తులో ఉన్న నలుగురు మైనర్లు హంగామా సృష్టించారు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇళ్ల ముందు నిలిపిన బైకులను తన్ని కింద పడేశారు. కేకలు వేస్తూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారిని పట్టుకోవడానికి వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు పారిపోయారు.

News March 27, 2024

కరీంనగర్ భూ దందా కేసుల్లో ఇద్దరి అరెస్ట్

image

కరీంనగర్ భూ దందా కేసుల్లో చింతకుంట మాజీ సర్పంచ్, కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్, KNR ఏడో డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్‌లను వేర్వేరు కేసుల్లో మంగళవారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రవీందర్ కేసులో ఆయనకు సహకరించిన అప్పటి తహశీల్దార్ సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ప్రకాష్ కేసులో మరో నలుగురిపై కేసులు నమోదు చేయగా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు

News March 27, 2024

జగిత్యాల: ఇనుపరాడ్డుతో తలపై దాడి.. భార్య మృతి

image

జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలంలో దారణ ఘటన జరిగింది. మారేడుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పున్నంరెడ్డి, భార్య రజిత మంగళవారం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన పున్నంరెడ్డి ఇనుప రాడుతో తలపై బలంగా కొట్టగా రజిత అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పెద్దపల్లి సీఐ, బసంత్ నగర్ ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

గోదావరిఖని: స్నేహితుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

image

గోదావరిఖని మార్కండేయ కాలనీలో వ్యక్తిగత విషయాలతో జరిగిన గొడవలో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వీరి మధ్య గొడవ జరగడంతో ఒకరినొకరు తిట్టుకుని వినీత్ కత్తితో కరణ్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన కరణ్ ను చికిత్స కోసం HYDఆస్పత్రికి తరలించారు. బాధితుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినీత్, అతని సోదరుడు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

News March 27, 2024

వేములవాడ రాజన్నకు రూ.2.21 కోట్ల ఆదాయం

image

వేములవాడ రాజన్నకు 21 రోజుల్లో రూ 221 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లెక్కించారు. 21 రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. అలాగే 463 గ్రాముల బంగారం 19.800 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు.

News March 27, 2024

ఇల్లంతకుంటలో గుండెపోటుతో విద్యార్థి మృతి !

image

సిరిసిల్ల: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగింది. గ్రామానికి చెందిన ఎల్లంకి సాయితేజ(14) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె వ్యాధితో సాయి బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

News March 27, 2024

జగిత్యాల: ఏఎస్ఐ సస్పెండ్

image

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్యను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. ఓ మహిళ తన భర్త వేధింపుల నుంచి రక్షించాలని ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో ఏఎస్ఐ పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించినట్లు వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 68 వేల నగదు సీజ్ . @ ధర్మారం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు. @ వేములవాడలో కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు. @ లైసెన్సుడ్ గన్ లను సరెండర్ చేయాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ వివాహితను ట్రాప్ చేసిన ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్.

News March 26, 2024

మల్యాల: మాజీ భార్య రెండో పెళ్లిచేసుకుందని హత్య చేశాడు!

image

ఇటీవల మల్యాల మండలం మ్యాడంపల్లిలో జరిగిన హత్య మిస్టరీ వీడింది. మాజీ భార్య రెండోపెళ్లిని తట్టుకోలేక ఓ భర్త ఆమెను హతమర్చాడు. సీఐ నీలం రవి తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్, యదాద్రి చెందిన కరిపే అంజలికి 2020 పెళ్లిచేసుకుని విడిపోయారు. తరచూ ఆమెకు ఫోను చేస్తూ వేధించేవాడు. ఈక్రమంలో ఆమె రెండోపెళ్లి చేసుకుంది. ఇది జీర్ణించుకులేక ఈ నెల 17న రప్పించి ఆమెను హత్య చేశాడు.

error: Content is protected !!