India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సు తుపాకులు కలిగిన వారు వెంటనే ఆయా స్టేషన్లలో సరెండర్ చేయాలని CPశ్రీనివాస్ (IPS) ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 7న తిరిగి తీసుకోవచ్చున్నారు . జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు పాటించాలన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ASI రామయ్యను SP ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఎస్పీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని వెళ్లిన వివాహితను కాపాడాల్సిన పోలీసే ట్రాప్ చేశాడని మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.
హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడిని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడుని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లు ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించిన సీపీ.. ఆయా ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రజాకార్ల అరాచకాలను చూపిస్తే, కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరమ్మ పాలన ఎలా ఉందో చూపించాలని అనుకుంటున్నారా..? అని ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు చేసిన వారిని వదిలేసి దారులకు గురైన వారిపైనే లాఠీ చార్జి చేస్తారా..? అని ప్రశ్నించారు.
జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 27, 28న ఉత్తర తెలంగాణ జోన్ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్, డిఏఓ బి. వాణి తెలిపారు. గత సీజన్లలో పంటల సాగులో తలెత్తిన సమస్యలను చర్చించి, వచ్చే సీజన్లకు చేపట్టాల్సిన పరిశోధన కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. టీ. శ్రీలక్ష్మి, టీఎస్సీ కోఆర్డినేటర్ డా. సీహెచ్. శోభారాణి తెలిపారు. ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ తానయ్య తెలిపారు. హుజరాబాద్ పెద్ద పాపయ్యపల్లి నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీలో, పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో, జగిత్యాల(D) కోరుట్ల రవి బీడీ వర్క్స్ కార్యాలయంలో, సిరిసిల్ల (D) పెద్దూరు గ్రీన్ నీడిల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.