Karimnagar

News March 29, 2024

జగిత్యాల: ఒంటిపై పెట్రోల్ పోసుకుని సూసైడ్

image

ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని పాడుబడ్డ కోళ్ల ఫారంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

కొండగట్టులో భక్తుడి మృతి

image

కొండగట్టు ఆలయ పరిసరాల్లో ఓ భక్తుడు మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి రాజు (48) 4 రోజుల కిందట కొండగట్టు ఆలయానికి వచ్చినట్లు వివరించారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.

News March 29, 2024

కరీంనగర్: ప్రవేశాలకు ఈ నెల 31న ఆఖరు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దూర విద్య డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం (2023-24) ప్రవేశాలు అపరాధ రుసుం రూ.200తో ఈనెల 31 వరకు పొందే అవకాశం విశ్వవిద్యాలయం కల్పించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఓపెన్ యూనివర్శిటీ కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 29, 2024

బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువలో సింగరేణి

image

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి చేరువగా ఉంది. ఏడాది 70 మి. టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్దేశించగా ఈనెల 27 వరకు 69.09 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి టార్గెట్ కు సమీపంలో చేరుకుంది. గతేడాది కూడా బొగ్గు ఉత్పత్తి టార్గెట్ కు చేరుకోలేదు. అలాగే గతేడాది లో సంస్థ రూ.2,222 కోట్లు లాభాలు సాధించగా ఈ ఏడాది మరింత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది

News March 29, 2024

KNR: విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. హెడ్ మాస్టర్ సస్పెండ్

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు గైర్హాజరైన గన్నేరువరం మండలం హనుమాజిపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మిని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు సస్పెండ్ చేశారు. విధులకు ఆలస్యంగా హాజరైన మరో ఇద్దరు ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైన సిబ్బంది వివరాలు తమ దృష్టికి తీసుకువస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 29, 2024

జగిత్యాల: హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

image

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో ఈ నెల 25న మేడిశెట్టి రమను హత్య చేసిన నిందితుడు బోగు ప్రకాశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల శివారులో గల లక్ష్మీగార్డెన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి బైక్, కొడవలి, ఫోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News March 29, 2024

జగిత్యాల: ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో బయట వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనలో హెడ్ కానిస్టేబుల్ అశోక్‌పై శాఖ పరమైన చర్యల నిమిత్తం మల్టీ జోన్-1ఐజీకి నివేదిక పంపించామని, ఆ నివేదిక ఆధారంగా అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News March 29, 2024

కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?

image

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?

News March 29, 2024

జగిత్యాల జిల్లాలో 1,18,824 హెక్టార్ల వరి సాగు

image

జగిత్యాల జిల్లాలో 2023 – 24 సీజన్‌లో 1,18,824 హెక్టార్ల వరిసాగు జరిగిందని దీనికి గాను 565241 mts ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గురువారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఎ 2203, కామన్ ధరలు 2183గా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌కు గాను ఐకెపి 133, పీఎసీఎస్ 282, మెప్మా 1, మొత్తం 416 వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.

News March 29, 2024

సిరిసిల్ల: ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయండి: కలెక్టర్

image

ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.50,000 మించి నగదు తరలిస్తే సీజ్ చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాలని అధికారులు ఆయన ఆదేశించారు.