India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అనంత నగర్కు చెందిన మహిళను ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిరంచి దర్యాప్తు చేపట్టారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలకు ప్రాణాధారమైన SRSPలోనూ నీటిమట్టం 19 టీఎంసీలకు పడిపోయింది. అటూ కరీంనగర్ జిల్లాలో సాగు, తాగునీట అవసరాలకు ఆధారపడి ఉన్న LMDలో 5.7 టీఎంసీలకు నీరు చేరింది. దీంతో కరీంనగర్ నగరానికి తాగునీటి కటకట ఏర్పాడనుంది. ఇప్పటికే రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. అటూ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు కలవర పడుతున్నారు.

మహిళలు, పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ప్రయాణాలు, పని ప్రదేశాలు, ఇతర చోట్ల వేధింపులు జరిగితే వెంటనే రక్షణ కోసం షీ టీమ్స్కు సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాక) మనవడు వంశీకృష్ణ. వంశీకి భార్య రోష్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన 2010లో అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పట్టా పొందారు. కాకా కుటుంబంలోని 3వ తరానికి చెందిన వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నారు. తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎఎమ్మెల్యేగా ఉండగా కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ బరిలో నిలిచారు.

పెద్దపల్లి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. అయితే పెద్దపల్లిలో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. మూడు పార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి.

లారీని ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. GDK నుంచి మంథని రహదారిలో మూసి వేసిన త్రీ ఇంక్లైన్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొగ్గు లారీని ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాకతీయ నగర్కి చెందిన మంద కిరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంథని ఎగ్లాస్పూర్కి చెందిన రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వివాహ వేడుక భోజనాల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న మధ్యాహ్నం భోజనాల విషయంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జగిత్యాల జిల్లా నూతన అదనపు ఎస్పీగా వినోద్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రోజున బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలు అధికారులు ఉన్నారు.

గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. కరీంనగర్ పార్లమెంటులో 2,181 నుంచి 2,189, నిజామాబాద్ పార్లమెంటులో 1,788 నుంచి 1807కి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1,827 నుంచి 1,847కు పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మొత్తం 5,796 నుంచి 5,843కు 47 కేంద్రాలు పెరిగాయి.

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్కు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటు సహచర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.