Karimnagar

News March 21, 2024

కరీంనగర్: హోటళ్లు, లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.

News March 21, 2024

నేడు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

పెద్దపల్లి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

News March 21, 2024

కరీంనగర్: 30 వరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బీ-ఫార్మసీ (సీబీఎస్సీ) 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ), 4, 6వ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్ష ఫీజు గడువు ఈనెల 30 వరకు ఉందని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఏప్రిల్ 3 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News March 21, 2024

రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 21, 2024

కరీంనగర్: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

బైకు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై సురేందర్‌ కథనం ప్రకారం.. గోపాల్‌రావుపేటకు చెందిన అరవింద్‌తో కలిసి రాకేశ్‌(21) మంగళవారం రాత్రి తన బావ బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. అక్కడి నుంచి చొప్పదండిలో భోజనం చేసేందుకు ఇద్దరు బైకుపై లక్ష్మీపూర్‌ మీదుగా బయలుదేరారు. వెంకట్రావుపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. క్షతగాత్రులను KNR ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే రాకేశ్‌ మృతి చెందాడు.

News March 21, 2024

కరీంనగర్: చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు!

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కమిషనరేట్‌లో 63 కేసులు నమోదు చేసి రూ.4.25 కోట్లు పట్టుకున్నారు. ఈ నెల 16న ప్రతిమ హోటల్‌లో పట్టుబడిన రూ.6.67 కోట్లను ఎన్నికల కోడ్ కింద పోలీసులు, IT అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.

News March 21, 2024

అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి: కలెక్టర్

image

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారులంతా నిబంధనల ప్రకారం పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వివిధ పథకాల కింద ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

News March 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద 2,53,000 నగదు సీజ్. @ కరీంనగర్ రూరల్ స్టేషన్ ఏఎస్సై కిషన్ గుండెపోటుతో మృతి. @ ఓదెల మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి. @ పెద్దపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ కమలాపూర్ మండలంలో రైలు నుండి పడి యువకుడికి గాయాలు. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.

News March 20, 2024

కరీంనగర్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్(59) బుధవారం జ్యోతినగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.

News March 20, 2024

పెద్దపల్లి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పొలం గట్టుపై విద్యుత్ తీగలు పడ్డాయి. బుధవారం ఉదయం రైతు పొలం పనులకు వెళ్ళగా.. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.