Karimnagar

News August 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో 24 గంటలలో 17 శస్త్ర చికిత్సలు. @ గొల్లపల్లి మండలంలో ఆర్దిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. @ ఉత్తమ కండక్టర్ అవార్డు అందుకున్న వేములవాడ డిపో మహిళా కండక్టర్. @ గొల్లపల్లి మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ ఉమ్మడి కరీంనగర్ లో పలుచోట్ల ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.

News August 24, 2024

వేములవాడ: 24 గంటల్లో 17 ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 6 డెలివరీలు, ఒక గర్భసంచిలో గడ్డ, 3 సాధారణ శస్త్రచికిత్సలు, 2 కంటి ఆపరేషన్లు & 5 ఆర్థో ఆపరేషన్లు ఉన్నాయి. ఇందులో సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్ డా. పెంచలయ్య, గైనకాలజిస్ట్ డా.సంధ్య, తదితరులున్నారు. ఇక్కడ అన్ని వైద్య సేవలు అందుతున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

News August 24, 2024

సౌదీ ఎడారిలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

image

‌కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో ప్రాణాలు కోల్పోయాడు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఆఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండ తీవ్రతతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

News August 24, 2024

కరీంనగర్: CSE వైపే విద్యార్థుల మొగ్గు!

image

ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు CSE కోర్సులో చేరేందుకు అమితాసక్తి చూపారు. ఒకప్పుడు హవా చాటిన ‘సివిల్’ ఈసారి డీలా పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అన్ని బ్రాంచిల్లో కలిపి 4,516 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈ కోర్సులో 1,420 సీట్లు ఉండగా.. 1,242 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 248 సీట్లకు గాను 115 మాత్రమే భర్తీ కాగా.. మెకానిల్‌ది అదే పరిస్థితి ఉంది.

News August 24, 2024

నేడు మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల

image

రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నుంచి శనివారం దిగువన ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి 6,300, మానేరు, మూలవాగు నుంచి 110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి కుడి కాలువ, అన్నపూర్ణ జలాశయానికి నీటి తరలింపును నిలిపివేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News August 24, 2024

కరీంనగర్: 9,77,472 రేషన్‌ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

image

రేషన్ కార్డు ఉన్నవారికి జనవరి నుంచి సన్నబియ్యంతోపాటు రాయితీపై గోధుమలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వారికి ఊరట కలగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 9,77,472 రేషన్ కార్డులు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు రేషన్ దుకాణం పంపిణీ చేసే దొడ్డు రకాలను వ్యాపారులకు విక్రయించి.. అధిక ధరలు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో సన్నరకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వారికి మేలు చేసేలా ఉంది.

News August 24, 2024

నేడు కరీంనగర్‌లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

image

కరీంనగర్ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు నేడు ఉదయం 10:30 గంటలకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యోగ క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News August 23, 2024

జగిత్యాలలో బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లెలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హర్షిత(14) 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు హాస్టల్లో ఉండమని మందలించడంతో 2రోజుల క్రితం గడ్డి మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. తండ్రి అంజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News August 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,44,198 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.76,932, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,180, అన్నదానానికి రూ.16,086 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 23, 2024

ఉమ్మడి జిల్లాలో పంటల సాగు వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టుతో దాదాపు వరినాట్లు పూర్తవుతాయి. అయితే సాగుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆహార, వాణిజ్య పంటలసాగు 12,35,875 ఎకరాలు, ఉద్యాన పంటల సాగువిస్తీర్ణం 1,96,204 ఎకరాలు, అటవీభూమి విస్తీర్ణం 6,26,025 ఎకరాలు, మొత్తం రైతులు 6,41,612 ఉన్నట్లు తెలిపారు.