Karimnagar

News February 22, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్ (2/2)

image

✓ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఏం తెచ్చడో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✓ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✓ చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
✓ ఇల్లందకుంట: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు
✓ చిగురుమామిడి: యూరియాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: మండలం వ్యవసాయ అధికారి రాజుల నాయకుడు
✓ మొలంగూర్ లో క్షయ వ్యాధి నివారణ మొబైల్ క్యాంప్

News February 22, 2025

KNR: రంజాన్ మాసం సందర్భంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

image

వచ్చే నెల 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై ముస్లిం మతపెద్దలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

News February 22, 2025

చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు

image

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. జూనియర్లపై దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలుంటాయని స్కూల్ డైరెక్టర్ కేసీ రావు తెలిపారు. విషయాన్ని గోరంతను కొండంతలు చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న స్కూల్‌ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించారని తెలిపారు. 

News February 22, 2025

కరీంనగర్: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

image

హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు KNRలోని రేకుర్తి గ్రామానికి చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News February 22, 2025

KNR: ‘ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్ 100% పూర్తి చేయాలి’

image

ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ 100 శాతం టార్గెట్ ను పూర్తి చేయాలని కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శుక్రవారం డివిజన్ల వారిగా నియమించిన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆస్తిపన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ లు వాటి పన్నులు, నగరపాలక సంస్థ దుకాణాల రెంటులు, మెండి బకాయి దారులు, అసెస్మెంట్ తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

News February 22, 2025

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. సూపరింటెండెంట్లు ప్రతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని, అక్కడ అన్ని వసతులను పరిశీలించాలని ఆదేశించారు.

News February 21, 2025

కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. కరీంనగర్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

News February 21, 2025

KNR: జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 33.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

News February 21, 2025

KNR: బండి సంజయ్‌పై ఉన్న కేసు కొట్టేసిన కోర్టు!

image

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కేంద్రమంత్రి బండి సంజయ్ దండుపాళ్యం ముఠాతో పోల్చారంటూ 2023లో నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసుపై గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తుది విచారణ జరిపి బండి సంజయ్‌ని నిర్దోషిగా ప్రకటించి, కేసు కొట్టి వేసింది.

News February 20, 2025

KNR: బెంగళూరు వెళ్లేవారికి 10% రాయితీ: RM 

image

కరీంనగర్, గోదావరిఖని డిపో నుంచి బెంగళూరుకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులలో ప్రయాణించే ప్రయాణీకులకు వారి బస్ ఛార్జీలో 10% రాయితీ కల్పించినట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణీకులు 10% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.