Karimnagar

News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017738>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళ మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

News April 7, 2025

జగిత్యాల: తల్లిదండ్రులపై కుమారుడి దాడి.. తీవ్రగాయాలు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులపై గడ్డపార, కొడవలితో కుమారుడు దాడి చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. భూతగాదాల విషయంలో నరేష్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు నాగరాజు, గంగమణిపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలు కావడంతో జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా కేంద్రం, ఇల్లందకుంట మండలంలో 40.1°C నమోదు కాగా, జమ్మికుంట 40.0, మానకొండూర్ 39.9, గంగాధర 39.8, రామడుగు 39.6, చొప్పదండి 39.4, కొత్తపల్లి 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక 39.1, సైదాపూర్ 39.0, గన్నేరువరం 38.9, శంకరపట్నం 38.7, తిమ్మాపూర్ 38.5, హుజూరాబాద్ 38.4, కరీంనగర్ రూరల్ 38.3°C గా నమోదైంది.

News April 6, 2025

KNR: బీజేపీ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షుడు

image

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి తన ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి కార్యకర్త బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ ఇంటిపై కాషాయ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

News April 6, 2025

కరీంనగర్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం

image

KNR కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, DJ సౌండ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల30 వరకు పొడగించామని CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కార్యక్రమాల నిర్వహణకు మైక్‌సెట్ వినియోగం తప్పనిసరైతే స్థానిక ACP అనుమతి పొందాలన్నారు.

News April 6, 2025

కరీంనగర్: లోయర్ మానేరు డ్యాం నీటి విడుదల నిలిపివేత

image

లోయర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే నీరును ఆదివారం నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల మార్చి 31 వరకు ఉండగా అదనంగా ఆరు రోజులు ఎక్కువ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం LMDలో 5.81టీఎంసీ నీరు మాత్రమే ఉందని, కరీంనగర్ నగరానికి కావలసిన తాగునీటికి ఇబ్బంది కాకుండా దిగువకు నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు.

News April 5, 2025

కరీంనగర్ వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

News April 5, 2025

గ్రూప్-1లో మెరిసిన గంగాధర ఎస్ఐ

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న వంశీ కృష్ణ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో 390వ ర్యాంక్ సాధించాడు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్-1 పరీక్ష రాయగా మెరుగైన ర్యాంక్ సాధించాడు. దీంతో ఆయనకు మండల ప్రజలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 5, 2025

కరీంనగర్ స్మార్ట్ సిటీ పెండింగ్ పనులపై సమీక్ష

image

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ లిమిటెడ్‌లో అభివృద్ధి పనులపై చర్చించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.