Karimnagar

News April 5, 2025

రోగుల సేవలో నర్సుల పాత్ర కీలకం: కరీంనగర్ కలెక్టర్

image

ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదవబోతున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం గణేశ్ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర ముఖ్యమైందని, మానవతా దృక్పథంతో వారు సేవలందించాలని సూచించారు.

News April 4, 2025

మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

News April 4, 2025

శంకరపట్నం: పోలీస్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు

image

కేశవపట్నం పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి పేర్కొన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఎలుకపెళ్లి కళ్యాణ్‌కు ఓ కేసు విషయమై కోర్ట్ సమన్లు ఇవ్వడానికి హోంగార్డ్ సదానందం అతని ఇంటికివెళ్ళగా.. తీసుకోవడానికి నిరాకరించాడు. అనంతరం సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించడంతో కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.

News April 4, 2025

కరీంనగర్: నేటి నుంచి జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె

image

నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

News April 4, 2025

జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.

News April 4, 2025

కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసిన మంత్రి పొన్నం బృందం

image

కేంద్ర సామాజిక న్యాయం,సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, BC ఎమ్మెల్యేలలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గురువారం వీరేంద్ర కుమార్‌ను మంత్రి కోరారు.

News April 3, 2025

SC, ST అట్రాసిటీ కేసులు 30లోగా పరిష్కరించాలి: బక్కి వెంకటయ్య

image

వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న SC, STఅట్రాసిటీ కేసులను ఈనెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

News April 3, 2025

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి: వెంకటయ్య

image

ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సంక్షేమంలో కరీంనగర్ జిల్లా పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ R&B గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అశ్రద్ధవహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు.

News April 3, 2025

KNR: LRS రిబేట్ సదుపాయం గడువు పొడిగింపు: కలెక్టర్

image

అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మార్చి 31 నాటికి ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 3, 2025

ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

image

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.