India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెట్పల్లి మండల శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు రాత్రి పదిన్నర గంటల సమయంలో రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.

భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. KNRకి చెందిన మౌనికరెడ్డిని, హుజూరాబాద్కి చెందిన రాకేశ్రెడ్డితో 2016లో పెళ్లైంది. రాకేశ్కెడ్డి తండ్రి తన ఆస్తిలో కొంతస్థలాన్ని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఇద్దరికి గొడవలు జరుతున్నాయి. ఆదివారం మౌనిక తండ్రికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, తెలిపి ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం మాదాపూర్లో EGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆదివారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ARO కిరణ్ ఆదేశాల మేరకు FST టీమ్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ పరిశీలించి BJP నాయకులు తిరుపతి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ప్రారంభించారని నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ నివాసంలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురి నాయకులతో గంగుల సమావేశం నిర్వహించారు.

@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇందుర్తిలో శనివారం 41.7℃ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 40.6, గంగాధర 40.5, రేణికుంట 39.7, కొత్తపల్లి 39.7, బూర్గుపల్లి 39.3, కరీంనగర్ 39.2, వెంకేపల్లి 39.2, కొత్తగట్టు 39.1, ఆసిఫ్నగర్ 38.9, తనుగుల 38.8, వీణవంక 38.8, మల్యాల 38.6, గుండి 38.6, చిగురుమామిడి 38.5, ఏదులగట్టేపల్లి 38.4, ఆర్నకొండ 38.4, చింతకుంట 37.8, బోర్నపల్లి 37.7, వెదురుగట్టు 37.6, దుర్శేడ్ 37.1, గట్టుదుద్దెనపల్లిలో 37.1℃.
Sorry, no posts matched your criteria.