India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుట్టపల్లి చెరువు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూక్య నరేశ్ మేకలు కాయడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
నూతన సంవత్సరం కొందరి జీవితాల్లో విషాదం నింపింది. వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. వివరాలిలా.. బావిలో పడి కూలీ చనిపోగా.. బైక్ అదుపుతప్పి బ్యాంకు ఉద్యోగి మరణించాడు. కరెంట్ షాక్తో మహిళ.. గుండెపోటుతో శ్రీనివాస్ రెడ్డి మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గట్టుబాబు.. మరో ప్రమాదంలో రమణకుమార్ చనిపోయారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,985 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,10,864, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.96,610, అన్నదానం రూ.25,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
@ ఓదెల మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి @ ధర్మపురి మండలంలో రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు @ కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జగిత్యాల డిఎస్పీ @ మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు.
రామగుండం సింగరేణి సంస్థ RG-2 81% బొగ్గు ఉత్పత్తి సాధించామని GMవెంకటయ్య అన్నారు. యైటింక్లైన్ కాలనీ GMఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం 3 మాసాలు పూర్తయ్యే నాటికి అధికారుల, ఉద్యోగుల కృషితో 100% టార్గెట్ రీచ్ అవుతామన్నారు. అలాగే సంస్థ ఉద్యోగులకు, పరిసర గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అధికారులు నరసింహారావు, రాముడు, నెహ్రూ, అనిల్ కుమార్ ఉన్నారు.
అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై గతంలో శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిపై అప్పటి ఎస్ఐ నరేశ్ పోక్సో కేసు నమోదు చేయగా తాజాగా నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణల అనంతరం జిల్లా జడ్జి నీలిమ నిందితుడికి ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో శివరాత్రి ముత్తయ్యకు కోర్టు <<15038521>>60 ఏళ్ల జైలు శిక్ష<<>> విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరం చేసిన వారు ఎవ్వరూ కూడా చట్టం నుంచి తప్పంచుకోలేరని అన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేశారు. “ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప” అంటూ విమర్శించారు. రైతుల రోదనలు, ఆడబిడ్డల ఆత్మహత్యలు, నిరుద్యోగుల్లో నిరాశ, హైడ్రాతో అరాచకాలు జరిగాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,018 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.73,514, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,490, అన్నదానం రూ.10,014 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.