Karimnagar

News February 19, 2025

జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

image

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ అంతా మైనింగ్ రంగందేనని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

News February 19, 2025

కరీంనగర్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

image

ఉమ్మడి KNR, ADB, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

News February 19, 2025

KNR: పోలీసుల కస్టడీలో నిందితులు

image

కరీంనగర్ పట్టణం కట్టరాంపూర్‌కు చెందిన సర్వే నంబర్ 954లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తప్పుడు హద్దులు చూపుతో భూమిని పలువురికి విక్రయించిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసిన ఘటనలో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. వీరి ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లను కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.కోటేశ్వర్, ఎస్ఐ రాజన్న స్వాధీనం చేసుకున్నారు.

News February 19, 2025

కరీంనగర్: ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

కరీంనగర్ పట్టణం కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల, గర్ల్స్ హాస్టల్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వసతిపై ఆరా తీశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్స్ చాట్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు.

News February 19, 2025

కరీంనగర్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి: కలెక్టర్ 

image

కరీంనగర్ జిల్లాలో యాసంగి పంటకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో నగరంతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2025

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించి రూ.7,550 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ సిబ్బంది, DCMS సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

News February 18, 2025

కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

రానున్న పదో తరగతి పరీక్షలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధతపై మంగళవారం మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం పదో తరగతి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు.

News February 18, 2025

NTPCలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

image

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 400అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News February 18, 2025

వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.