India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై గతంలో శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిపై అప్పటి ఎస్ఐ నరేశ్ పోక్సో కేసు నమోదు చేయగా తాజాగా నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణల అనంతరం జిల్లా జడ్జి నీలిమ నిందితుడికి ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో శివరాత్రి ముత్తయ్యకు కోర్టు <<15038521>>60 ఏళ్ల జైలు శిక్ష<<>> విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరం చేసిన వారు ఎవ్వరూ కూడా చట్టం నుంచి తప్పంచుకోలేరని అన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేశారు. “ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప” అంటూ విమర్శించారు. రైతుల రోదనలు, ఆడబిడ్డల ఆత్మహత్యలు, నిరుద్యోగుల్లో నిరాశ, హైడ్రాతో అరాచకాలు జరిగాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,018 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.73,514, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,490, అన్నదానం రూ.10,014 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్గా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ నూతన కార్యవర్గం సమావేశాన్ని KNR సర్కస్ గ్రౌండ్లో నిర్వహించారు. ఉమ్మడి KNR జిల్లాతో పాటు హుస్నాబాద్ జోన్ల నుంచి సమావేశానికి హాజరైన బిల్డింగ్ పెయింటర్స్ ఆమోదంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయింది. జేసి చైర్మన్గా చాడ ఆనంద్, అధ్యక్షుడిగా ప్రభాకర్ను ఎన్నుకున్నారు.
2024 సంవత్సరం రవాణా శాఖ విజయాలతోనే ముగుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణను తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత సాధించినట్లు తెలిపారు.
కొత్త సంవత్సరం వేడుకలకు కరీంనగర్ సిద్ధమయింది. నేటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో ఇప్పటికే నగరంతో పాటు.. గ్రామాల్లో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో నగరం మెరిసిపోతుండగా.. ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావారణం కనిపిస్తోంది. మరి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముంపునకు గురైన తాళ్ల కొత్తపేట గ్రామంలోని ప్రకృతి అందాలు “Way2News” కెమెరాకు చిక్కాయి. గ్రామంలోని గోదావరి నది తీరంలో అరుదైన కొంగలు కనువిందు చేశాయి. ఇలాంటి ప్రకృతి అందాలు చూసిన గ్రామస్థులు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రకృతి అందాలు ఆస్వాదించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.62,01,156 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.62,720, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,380, అన్నదానం రూ.7,458, హుండీ లెక్కింపు ద్వారా రూ.60,87,598 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.