Karimnagar

News July 30, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.71,003 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.43,412, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.18,650, అన్నదానం రూ.8,941,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News July 30, 2024

ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది: మంత్రి పొన్నం

image

రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1 లక్ష 50 వేల వరకు 9211 మంది రైతులు రుణమాఫీ పొందారని పేర్కొన్నారు. రుణమాఫీ కింద హుస్నాబాద్ నియోజకవర్గానికి 93 కోట్ల 89 లక్షల ఆర్థిక సాయం అందిందని తెలిపారు.

News July 30, 2024

KNR: రెండో విడత రుణమాఫీ వివరాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ రెండో విడత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 21,785 మంది రైతులకు రూ.207.82 కోట్లు, జగిత్యాల జిల్లాలో 17,903 మంది రైతులకు రూ.169.11 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 13,401 రైతులకు రూ.124.41 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 12,202 మంది రైతులకు రూ.117.77 కోట్ల రుణమాఫీ వర్తించినట్లు అధికారులు తెలిపారు.

News July 30, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో బదిలీలు

image

ఉమ్మడి KNR వ్యాప్తంగా దేవాదాయ శాఖలో బదిలీల ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని అర్చకులతో పాటు.. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు, పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరికి పదవీ విరమణ వయసు దగ్గర పడటంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి KNR అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం బదిలీలకు శ్రీకారం చుట్టిందన్నారు.

News July 30, 2024

KNR: మూడేళ్లలో 341 కేసులు

image

ఉమ్మడి KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లలోపు విద్యార్థులు బైకులు, కార్లు నడపుతుండటంతోనే ప్రమాదాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 70కి పైగా మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. 2022లో 32, 2023లో 231, 2024లో 78.. గత మూడేళ్లలో మొత్తం 341 కేసులు నమోదయ్యాయని, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని KNR టౌన్ ACP జి.నరేందర్ తెలిపారు.

News July 30, 2024

పెద్దపల్లి: తండ్రి మందలింపు.. కొడుకు ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజిరెడ్డి పద్మ దంపతుల కొడుకు రమేశ్(30) MBA పూర్తి చేసి మూడేళ్లుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. పొలం పనుల్లో తమకు సహాయం చేయకుండా రోజు ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నాడని రాజిరెడ్డి మందలించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

News July 30, 2024

కరీంనగర్: మొదలైన పంచాయతీ ఎన్నికల కసరత్తు

image

CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి KNR జిల్లాకు వచ్చే నెల 2న వార్డుల మ్యాపింగ్, ఓటరు జాబితా తయారీపై కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జగిత్యాలలో 380, పెద్దపల్లి 265, KNR 313, సిరిసిల్ల 255.. ఉమ్మడి జిల్లాలోని 1,213 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లు శిక్షణలో పాల్గొననున్నారు.

News July 30, 2024

PDPL: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

image

విష జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేటలో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేశ్-పద్మ దంపతులకు సాత్విక్(13) కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడు కొద్ది రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం KNR వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News July 30, 2024

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: MLAలు

image

కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని రామగుండం MLA రాజ్ ఠాకూర్, పెద్దపల్లి MLA చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావులు కాళేశ్వరంపై చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.

News July 30, 2024

KNR: స్థానిక ఎన్నికలు.. ఓటరు జాబితాకు కసరత్తు

image

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్‌లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.