India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ సిద్దిపేటలో <<15009544>>కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుల బాధతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.25 లక్షలు అప్పులు చేసి ప్రైవేటు కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు తనకు చెప్పారని పేర్కొంది. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది.
మల్యాలలోని అంగడీ బజార్ బస్ షెల్టర్ ముందు పలువురు వృద్ధులు కూర్చొని ముచ్చటించుకోవడం స్థానికులను ఒక్కసారిగా గతానికి తీసుకెళ్లింది. చేతిలో కర్ర, నెత్తికి రుమాలు, భుజాన తువ్వాల, పంచెకట్టులో ప్రతి రోజు సాయంత్రం తాతలు కాసేపు ఇక్కడ గడుపుతారు. అయితే అంత మంది వృద్ధులు కూర్చున్నారేంటని పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ల తరమే బాగుందని, కాసేపు వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబ సభ్యులతో సిద్దిపేటలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ.. భార్య ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం బాలకృష్ణ ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు భార్య పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
గోదావరిఖని బాపూజీ నగర్కు చెందిన లలిత(18) వివాహిత మృతిపై విచారణ చేపట్టినట్లు వన్ టౌన్ SI భూమేశ్ తెలిపారు. గత 3 మాసాల క్రితం అదే కాలనీకి చెందిన కుమారస్వామి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నిత్యం మద్యం తాగి కుమారస్వామి అదనపు కట్నం కోసం గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆమె ఉరివేసుకొని మృతిచెందింది. తల్లి శారద లలిత మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు SI తెలిపారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,06,120 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,72,891 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.94,145, అన్నదానం రూ.39,084 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ గోదావరిఖనిలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి. @ సెంచరీ చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కొప్పుల అభినందనలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడ మండలంలో ఇండ్లలోకి వచ్చిన కొండచిలువ. @ ధర్మపురి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. @ వే టు న్యూస్ కు విషెస్ తెలిపిన జగిత్యాల MLA
☞పెద్దపల్లి: పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్టు ☞మల్లాపూర్: కారు, బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ☞శంకరపట్నం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్ ☞మెట్ పల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య ☞రామగుండం: అన్ లైన్ గేమ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు ☞పెగడపల్లి: అనారోగ్యంతో ఆరవెల్లి BRS గ్రామ శాఖ అధ్యక్షుడు మృతి ☞రామగుండం: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీశ్ అంటూ ఆకాశానికి పొగిడారు.
కరీంనగర్కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత కరీంనగర్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చి శని పూజలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చి శని పూజలు చేశారు. ఆ తర్వాత మళ్లీ గోదావరి నదిలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.