India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ జగిత్యాల ప్రజావాణిలో 32, సిరిసిల్ల ప్రజావాణిలో 141 ఫిర్యాదులు.
@ రాయికల్ మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో ఆత్మహత్యకు పాల్పడిన ఐటిఐ విద్యార్థి.
@ రామడుగు మండలంలో తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు.
@ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న పోలీసులు
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. నిత్యం వేలాది మందిగా వచ్చి ఆలయ ధర్మగుండంలో స్థానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సారి అమావాస్య సోమవారం కారణంగా బోసిపోయింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అర్చకులు ఖాళీగా కనిపించారు.
కరీంనగర్ ఆస్పత్రిలో కరెంట్ కోతపై BRS నేత RS ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్కు TGNPDCL వివరణ ఇచ్చింది. ఆసుపత్రికి సరఫరా చేసే సబ్స్టేషన్లోని 33 కేవీ ఫీడర్ 17:52 గంటలకు ట్రిప్ అయింది, సిబ్బంది వెంటనే అప్రమత్తమై 17:57 గంటలకు తిరిగి ఛార్జ్ చేయడంతో ఫీడర్పై 5 నిమిషాల అంతరాయం ఏర్పడిందని రీట్వీట్ చేసింది. ఆసుపత్రిలో జనరేటర్ ఉందని పేర్కొంది.
కరీంనగర్ జిల్లాలో ఈ నెల 4న ఉదయం 7:28 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. గోదావరి నది తీరా ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. 2024లో సంభవించిన భూకంపం ఉమ్మడి జిల్లా ప్రజలను ఒక్కసారిగా వణికించిందని చెప్పవచ్చు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని BJP లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి బండి సంజయ్ 2,25,209 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు పెద్దపల్లి లోక్సభ పరిధి నుంచి పోటీ చేసిన గొమాసే శ్రీనివాస్ 3,44,223 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో BJPకి భారీగా ఓట్లు రావడం రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.
గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ సిద్దిపేటలో <<15009544>>కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుల బాధతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.25 లక్షలు అప్పులు చేసి ప్రైవేటు కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు తనకు చెప్పారని పేర్కొంది. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది.
మల్యాలలోని అంగడీ బజార్ బస్ షెల్టర్ ముందు పలువురు వృద్ధులు కూర్చొని ముచ్చటించుకోవడం స్థానికులను ఒక్కసారిగా గతానికి తీసుకెళ్లింది. చేతిలో కర్ర, నెత్తికి రుమాలు, భుజాన తువ్వాల, పంచెకట్టులో ప్రతి రోజు సాయంత్రం తాతలు కాసేపు ఇక్కడ గడుపుతారు. అయితే అంత మంది వృద్ధులు కూర్చున్నారేంటని పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ల తరమే బాగుందని, కాసేపు వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబ సభ్యులతో సిద్దిపేటలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ.. భార్య ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం బాలకృష్ణ ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు భార్య పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
గోదావరిఖని బాపూజీ నగర్కు చెందిన లలిత(18) వివాహిత మృతిపై విచారణ చేపట్టినట్లు వన్ టౌన్ SI భూమేశ్ తెలిపారు. గత 3 మాసాల క్రితం అదే కాలనీకి చెందిన కుమారస్వామి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నిత్యం మద్యం తాగి కుమారస్వామి అదనపు కట్నం కోసం గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆమె ఉరివేసుకొని మృతిచెందింది. తల్లి శారద లలిత మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు SI తెలిపారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,06,120 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,72,891 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.94,145, అన్నదానం రూ.39,084 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.