Karimnagar

News December 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరిఖనిలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి. @ సెంచరీ చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కొప్పుల అభినందనలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడ మండలంలో ఇండ్లలోకి వచ్చిన కొండచిలువ. @ ధర్మపురి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. @ వే టు న్యూస్ కు విషెస్ తెలిపిన జగిత్యాల MLA

News December 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞పెద్దపల్లి: పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్టు ☞మల్లాపూర్: కారు, బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ☞శంకరపట్నం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్ ☞మెట్ పల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య ☞రామగుండం: అన్ లైన్ గేమ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు ☞పెగడపల్లి: అనారోగ్యంతో ఆరవెల్లి BRS గ్రామ శాఖ అధ్యక్షుడు మృతి ☞రామగుండం: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

News December 28, 2024

నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్లో కెప్టెన్ అవుతారు: కేటీఆర్

image

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీశ్ అంటూ ఆకాశానికి పొగిడారు.

News December 28, 2024

కరీంనగర్‌కు నాస్కామ్ శుభవార్త!

image

కరీంనగర్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత కరీంనగర్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

News December 28, 2024

కాళేశ్వరంలో శని త్రయోదశి సందర్భంగా శని పూజల సందడి

image

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చి శని పూజలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చి శని పూజలు చేశారు. ఆ తర్వాత మళ్లీ గోదావరి నదిలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

News December 28, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ. 1,66,999 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.99,943 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 53,230, అన్నదానం రూ.13,826 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News December 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య ☞రామడుగు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ☞మంథని: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు మూగజీవాలు మృతి ☞ఎల్కతుర్తి: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి ☞కమలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ☞వేములవాడ: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ☞కమాన్ పూర్: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు ☞ఓదెల: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.

News December 27, 2024

మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం 

image

భారత మాజీ ప్రధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార‌త‌దేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మ‌హోన్న‌త వ్య‌క్తిని కొల్పోయింద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News December 27, 2024

వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్‌తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి

image

భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.