Karimnagar

News December 25, 2024

KNR: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి KNRజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి KNR, JGTL, SRCL, PDPL జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం

image

ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.

News December 25, 2024

KNR: భూమి లేని పేదలను గుర్తించేదెలా!

image

భూమిలేని పేదలకు ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. తొలి విడతగా ఈనెల 28న రూ.6 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఉపాధి హామీ జాబ్ కార్డు దారుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,52,932 కార్డుదారులు ఉన్నారు. వీరిలో భూమి ఉన్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ఆధారంగా చేస్తారా? లేక రైతు భరోసా ఆధారంగా ఎంపిక చేస్తారా! అనేది సందేహంగా మారింది.

News December 25, 2024

నేడు SRSP కాకతీయ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల: SE

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఇవాళ ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు. ఇందులో భాగంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1 (D5 నుంచి D53) ఆయకట్టుకు 7 రోజులు, జోన్-2 (D54 నుంచి D94) ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. మొదట జోన్ 2కు ఏప్రిల్ 8 వరకు సాగునీటి విడుదల ఉంటుందని వివరించారు.

News December 25, 2024

KNR: ‘‘భారత్ బ్రాండ్” విక్రయ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి

image

కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహార ఉత్పత్తుల విక్రయాలు జరపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “భారత్ బ్రాండ్” విక్రయవాహనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

News December 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ జగిత్యాల లో మిని స్టేడియం ను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ మల్లాపూర్ మండలంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని, తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. @ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. @ కోరుట్లలో వైభవంగా మహా పడిపూజ.

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞వీణవంక: వ్యక్తిపై గొడ్డలితో దాడి ☞శంకరపట్నం: రెండు RTC బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం ☞వీణవంక: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి ☞రామడుగు: అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి ☞రాయికల్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ☞రుద్రంగి: మైనర్ తల్లిపై కేసు నమోదు ☞ముస్తాబాద్: గుండెపోటుతో వ్యక్తి మృతి ☞కథలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.

News December 24, 2024

కరీంనగర్‌: దివ్యాంగులకు జాబ్ మేళా

image

కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాస్ రూట్ అకాడమీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 27 డిసెంబర్ 2024న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి కె సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.

News December 24, 2024

వరిధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు

image

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.

News December 24, 2024

BREAKING.. వీణవంకలో దారుణం.. వ్యక్తిపై గొడ్డిలితో దాడి

image

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో వెంకటరాజురెడ్డి అనే వ్యక్తిపై ముగ్గురు దుండగులు గొడ్డలితో దాడి చేసి చేతి వేళ్లు నరికేశారు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలించారు. కాగా, బాధితుడు సీడ్ వ్యాపారిగా తెలుస్తోంది. చేతి నాలుగు వేళ్లు కట్ అవగా.. బొటన వేలు ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.