India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకులంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఈరోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. దీంతో సిబ్బంది ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అంతర్గాం ఎస్సె వెంకటస్వామి కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లికి చెందిన శివ కుమార్ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి మిత్రులతో కలిసి బైక్పై గోదావరిఖని వైపు వెళ్తుండగా కుందనపల్లి ఐఓసీఎస్ డిపో సమీపంలో యూ టర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో శివకుమార్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన LLB ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్ విడుదల చేశారు. ఫలితాలను www.satavahana.ac.in వెబ్ సైట్లో చూసుకోవచ్చు అని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్కు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కరీంనగర్ జిల్లా నేతలు కలిశారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నివాసంలో గురువారం బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
@ సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ దుర్షేడులోని బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్. @ రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిగా వసంతరావు బాధ్యతలు స్వీకరణ. @ జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు ఇండ్లలో చోరీ. @ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కరీంనగర్ ఎల్ఎండి నీ పరిశీలించిన కేటీఆర్.
ఉమ్మడి కరీంనగర్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంథని, గొల్లపల్లి, మేడిపల్లి, కోరుట్ల, ముస్తాబాద్, బోయిన్ పల్లి, జమ్మికుంట, బాలుర కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్కు సుల్తానాబాద్ శాస్త్రినగర్లో ఉన్న గురుకుల కళాశాల వద్ద ఉ.9 గంటలకు హాజరుకావాలని కోరారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే బీపీఈడీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవనున్నాయి. యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ బ్రాంచ్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు SU పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
మెట్పల్లి పట్టణంలో ఒక్క రోజే నలుగురికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మెట్పల్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.మోహన్తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో పేషెంట్ల ఇళ్లకు వెళ్లి శానిటేషన్ చేయించారు. ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పు చెప్పారు. కరీంనగర్ పట్టణంలో ఉంటున్న భార్యాభర్తలకు తొమ్మిదేళ్ల కుమార్తె 2020 FEB 24ర ఆడుకుంటుండగా ఇంలల్లి సమీపంలో ఉన్న నరేశ్, రవితేజ బాలిక ఓంటరిగా కనిపించడంతో అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. మరుసటి రోజు కూడా బాలికపై అత్యాచారం చేయడంతో అస్వస్థతకు గురైంది, ఈక్రమంలో రక్త పరీక్షలు చేయగా విషయం తెలిసింది. కైసు నమోదైంది
Sorry, no posts matched your criteria.