India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్త్ రఫ్ చేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ జగిత్యాల లో మిని స్టేడియం ను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ మల్లాపూర్ మండలంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని, తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. @ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. @ కోరుట్లలో వైభవంగా మహా పడిపూజ.
☞వీణవంక: వ్యక్తిపై గొడ్డలితో దాడి ☞శంకరపట్నం: రెండు RTC బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం ☞వీణవంక: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి ☞రామడుగు: అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి ☞రాయికల్: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ☞రుద్రంగి: మైనర్ తల్లిపై కేసు నమోదు ☞ముస్తాబాద్: గుండెపోటుతో వ్యక్తి మృతి ☞కథలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత.
కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాస్ రూట్ అకాడమీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 27 డిసెంబర్ 2024న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి కె సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. వీణవంక మండలం హిమ్మత్నగర్లో వెంకటరాజురెడ్డి అనే వ్యక్తిపై ముగ్గురు దుండగులు గొడ్డలితో దాడి చేసి చేతి వేళ్లు నరికేశారు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలించారు. కాగా, బాధితుడు సీడ్ వ్యాపారిగా తెలుస్తోంది. చేతి నాలుగు వేళ్లు కట్ అవగా.. బొటన వేలు ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వివిధ అంశాలపై టెండర్ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారులు తెలిపారు. ఆలయంలోని టెంకాయలు, గుమ్మడికాయలు, కిరాణా షాపులు, వాహన పార్కింగ్ లైసెన్స్ హక్కు, కూల్ డ్రింక్స్, పూల దండలు, తల్లి ఆరాధన లైసెన్స్ హక్కు సహ పలు వాటికి ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల నాయకులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
@ జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. @ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. @ కరీంనగర్ ప్రజావాణిలో 333, సిరిసిల్ల ప్రజావాణిలో 142 ఫిర్యాదులు. @ ట్రాఫిక్ పోలీస్ విధులలో చేరిన ఎండపల్లి మండల ట్రాన్స్ జెండర్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. @ బాధ్యతలు స్వీకరించిన మెట్పల్లి, మల్లాపూర్ నూతన ఎంపీడీవోలు.
☞JGTL: డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో యువకుడు పై దాడి ☞JMKT: గుంపుల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు☞మల్లాపూర్: బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష☞కమలాపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ☞మద్దికుంటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ☞వీణవంక: చల్లూరు లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని వ్యక్తి మృతి☞మంథనిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా
@ గంగాధర పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య@ కమలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు@ ముస్తాబాద్ మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య@ వీణవంక మండలంలో ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,43,740 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.72,782, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.56,640, అన్నదానం రూ.14,318 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.