Karimnagar

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. కరీంనగర్ ఆశిస్తుందిదే..

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

News July 25, 2024

సిరిసిల్ల: గిరిజన బిడ్డకు సీఎం ఆదేశాలతో చెక్కు అందజేత

image

జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ మారడంతో సీఎం స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ.1,51,831 చెక్కును అందించారు.

News July 24, 2024

సిరిసిల్ల: పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండ

image

IIT పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం అందించాలని CMO ఆదేశాలు జారీ చేసింది. వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాలోని రాములు-సరోజ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చివరి కూతురు మధులత. అయితే ఈమె JEE మెయిన్‌లో ప్రతిభ చూపి ST కేటగిరిలో 824వ ర్యాంకు సాధించింది. వారి ఆర్థిక పరిస్థితిని కొందరు CM దృష్టికి తీసుకురాగా సాయం అందించారు.

News July 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. @ సిరిసిల్లలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. @ మెట్‌పల్లి పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్. @ పెగడపల్లి మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్.

News July 24, 2024

ఆగస్టు 15 నాటికి రూ.50 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం: కలెక్టర్

image

ఆగస్టు 15 నాటికి ₹50 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అర్హులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం మహిళా శక్తి పథకం కింద రుణాలను మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆర్ఎచ్ అరుణ సవితా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్‌లు, ఎస్ఈఆర్పీ, మెప్మా బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు బ్యాంక్ అధికారులు తదితరులున్నారు.

News July 24, 2024

కరీంనగర్ : బీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ (ప్రథమ సెమిస్టర్) ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. పరీక్ష ఫలితాలను www.satavahana. ac.inలో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.

News July 24, 2024

కరీంనగర్: లారీ ఢీకొని యువకుడి మృతి

image

లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన గుండ్ల శ్రీనివాస్(27) సుల్తానాబాద్‌లో ఉంటున్న తన మిత్రుడి దగ్గరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 24, 2024

సింగరేణి కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా

image

సింగరేణిలో పని చేస్తూ HDFC బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి భవన్‌లో బలరాం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా GMలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News July 24, 2024

కరీంనగర్: కేంద్ర బడ్జెట్‌లో నిరాశే!

image

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టడంతో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్రయోజనం కలిగించే ఒక్క ప్రాజెక్టు గురించైనా ప్రకటన ఉంటుందని ప్రజలు భావించారు. కానీ ఈ సారి ఉమ్మడి జిల్లాపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన రాలేదు. కొత్త జిల్లాలకు నవోదయ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని ఆశించినా నిరాశే మిగిలింది. బసంత్‌నగర్‌ వద్ద విమానాశ్రమం ఏర్పాటుపైనా ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరుత్సాహపరిచింది.

News July 23, 2024

భూటాన్‌ దేశంలో మెరిసిన మంథని యువకుడు

image

భూటాన్‌లో జరిగిన సౌత్ ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్‌ పైడి పాటి బాబీవర్మ (అండర్-21) 60 కిలోల కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పోటీలు ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగాయి. ఈ విజయంతో ఆగస్టు 23 నుంచి 25 వరకు – దీంతో బాబీ వర్మను పలువురు అభినందించారు.