India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఎలాంటి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఇటీవల జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకెళ్ళారు. శనివారం వీసీ ఉమేష్ కుమార్ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ కి జేఏసీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్లలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం BY నగర్కు చెందిన నక్క శ్రీనివాస్(41) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా నిన్న మరో నేత కార్మికుడు<<14931601>> దూస గణేశ్ సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,39,961 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,396 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.41,040, అన్నదానం రూ.20,525,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు.
@ మేడిపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ ధర్మారం మండలంలో వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి. @ కాటారం మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. @ కోరుట్లలో మాయమాటలు చెప్పి వృద్ధురాలి బంగారం అపహరణ. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వీణవంక మండలంలో ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్ట్. @ అక్రమ ఇసుక రావాలను అరికట్టాలన్న జగిత్యాల కలెక్టర్.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న నాలుగు నెలల మగ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా వరంగల్కు చెందిన పిల్లలు లేని దంపతులకు శుక్రవారం దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని, తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్కు నిజాయితీ లేదని విమర్శించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా కొనసాగుతోంది. అయితే 3 రోజుల నుంచి ఈ యాప్ సరిగా పనిచేయడం లేదు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో లబ్ధిదారులు నిలబెట్టి ఫొటో తీసి అప్లోడ్ చేసే ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. యాప్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందువల్లే సర్వర్ డౌన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం కనిపించినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ మేరకు గురువారం రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ను సంప్రదించగా.. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫార్ములా- ఈ రేసింగ్లో తాను ఏ తప్పు చేయలేదని KTR అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను పెంచేందుకే రేసింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు. EVని నగరానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో కుంభకోణం ఏమీ లేదన్నారు. పైగా HYDకు రూ. వందల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. GHMCకి ప్రచారం, ఆదాయం సమకూరినట్లు KTR వెల్లడించారు. మీ కామెంట్?
☛SRCL: కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు☛CHMD: బోయిన్పల్లి లో వాహనం ఢీకొని చిన్నారి మృతి ☛శంకరపట్నం: ఆటో ట్రాలీ, లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ☛JGL: జగిత్యాల సబ్ జైల్లో గుండెపోటుతో ఖైదీ మృతి ☛కథలాపూర్: బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.1.59 లక్షలు మాయం☛మేడిపల్లి: స్వచ్ఛంద సంస్థ పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Sorry, no posts matched your criteria.