India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజ్, మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలకు వరద నీరు కొనసాగుతోంది. సరస్వతి బ్యారేజీకి 16,800 క్యూసెక్కుల నీరు రాగా, అంతే స్థాయిలో 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి 8,52,240 క్యూసెక్కుల వరద నీరు రాగా.. 85 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
GDKలో అన్న చేతిలో <<13685729>>తమ్ముడు హతమైన<<>> విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. భగత్సింగ్నగర్లో అద్దెకు ఉంటున్న ఓదెలుకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. అయితే పెద్ద కొడుకు అనిల్కు పెళ్లి కాలేదు. చిన్న కొడుకు సునిల్(35) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనిల్ నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం తల్లితో గొడవపడుతుండగా ఆపడానికి వెళ్లిన సునిల్పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
GDKలో అన్న చేతిలో <<13685729>>తమ్ముడు హతమైన<<>> విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. భగత్సింగ్నగర్లో అద్దెకు ఉంటున్న ఓదెలుకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. అయితే పెద్ద కొడుకు అనిల్కు పెళ్లి కాలేదు. చిన్న కొడుకు సునిల్(35) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనిల్ నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం తల్లితో గొడవపడుతుండగా ఆపడానికి వెళ్లిన సునిల్పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయికృష్ణ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం గ్రామ శివారులోని ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు విస్తృతంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో వర్షపాతం ఓ మాదిరిగానే నమోదైనా.. ఎస్సారెస్పీ కాలువలో మాత్రం నీరు కనిపించడం లేదు. ఇప్పటికే ఒకింత వ్యవసాయం ఆలస్యంగా మొదలైందని రైతులు వాపోతున్నారు. ఎస్సారెస్పీ కాలువలో వదిలే నీరు తమకు ఆధారమని, సరైన సమయానికి మీరు వదిలేలా అధికారులు సన్నద్ధం కావాలని రైతులు కోరుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలకు చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
@ రాయికల్ మండలంలో ఉరOసుకొని మహిళ ఆత్మహత్య.
@ కరీంనగర్ ప్రజావాణిలో 223 ఫిర్యాదులు.
@ సిరిసిల్లలో గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్.
@ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.
@ నూతన కలెక్టరేట్ను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.
@ రాయికల్ మండలంలో యువతి ఆత్మహత్య.
@ జగిత్యాల ప్రజావాణిలో 37 ఫిర్యాదులు.
గోదావరిఖనిలో దారుణం జరిగింది. పోలీసుల ప్రకారం.. కృష్ణానగర్లో ఆత్మకూరి అనిల్ అనే వ్యక్తి అతడి తమ్ముడు సునీల్, తండ్రి ఓదెలతో ఘర్షణకు దిగి వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వీరిమధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.