India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాముకాటు
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
@ జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి
@ చిగురు మామిడి మండలంలో విద్యుత్ షాక్ తో గేదె మృతి
@ జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు సరెండర్ చేసిన కలెక్టర్
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా కొండ చుట్టూ చదును చేయడానికి ఆలయం వద్ద గతనెల 27న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ దారి నిర్మాణం దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.10 రోజుల్లోనే 2 కి.మీలు కొండచుట్టూ భక్తులు నడిచేందుకు వీలుగా దారి చేశారు. దారి నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సొంతంగా రూ.2 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.78,215 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.39,432, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.28,170, అన్నదానం రూ.10,613 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS(IG) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది, కేసుల నమోదులు, రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.
మహిళలు, విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని ఎస్పీ అఖిల్ మహజన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులని చైతన్య పర్చే ఉద్దేశంతో ముస్తాబద్ మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సోపై అవగాహన కల్పించారు.
ప్రస్తుత శీతాకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాటి తేగలు(తాటి గేగులు) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటి తెగలో ముఖ్యంగా పీచు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తెగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఖైదీ క్యాతం మల్లేశం(43) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో సబ్ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12,72,348 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 11,05,493 ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. రేషన్ కార్డ్, ఇతర అవసరాల కోసం1,66,855 దరఖాస్తులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 4,28,995, పెద్దపల్లిలో 2,69,461, కరీంనగర్లో 3,54,363, సిరిసిల్లలో 2,19,529 దరఖాస్తులు వచ్చాయి.
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి నాకు సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. గంజాయి సాగు, నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకంపై నియంత్రణ చర్యలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఉచితంగా ప్రచారం చేయాలని సూచించారు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ మండలం నూకలమర్రిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకలమర్రికి చెందిన రషీద్ను తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారన్నారు. రషీద్ గంగాధర మండలంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.