India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత శీతాకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాటి తేగలు(తాటి గేగులు) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటి తెగలో ముఖ్యంగా పీచు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తెగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఖైదీ క్యాతం మల్లేశం(43) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో సబ్ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12,72,348 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 11,05,493 ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. రేషన్ కార్డ్, ఇతర అవసరాల కోసం1,66,855 దరఖాస్తులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 4,28,995, పెద్దపల్లిలో 2,69,461, కరీంనగర్లో 3,54,363, సిరిసిల్లలో 2,19,529 దరఖాస్తులు వచ్చాయి.
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి నాకు సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. గంజాయి సాగు, నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకంపై నియంత్రణ చర్యలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఉచితంగా ప్రచారం చేయాలని సూచించారు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ మండలం నూకలమర్రిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకలమర్రికి చెందిన రషీద్ను తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారన్నారు. రషీద్ గంగాధర మండలంలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో IT విస్తరించనుంది. మెరుగైన రవాణా సదుపాయాలు, మానవ వనరులు ఉమ్మడిజిల్లాను ఐటీ సెంటర్గా మార్చనున్నాయి. ఇప్పటికే కరీంనగర్లో ఐటీ టవర్ ఉంది. దీని ద్వారా కొన్ని కంపెనీలు సేవలందిస్తున్నాయి. ఈ దిశలోనే మరికొన్ని కంపెనీలు మంథని, కరీంనగర్లోని కొత్తపల్లిలో అడుగుపెట్టనున్నాయి. IT సేవలకు అనువైన నగరంగా GCC నివేదించినట్లు సమాచారం. దీంతో పలు దేశాలకు కరీంనగర్ సేవలందనున్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ఇవాళ దేవాదాయ శాఖ తరఫున ఆలయ పండితులు కలిశారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి రావాలని ఆహ్వన పత్రికను అందజేశారు. కాగా దీనిపై మంత్రి, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. ఇదివరకు అక్టోబర్ 2 నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపి వేసింది. దీంతో ఈసారైనా కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలిగేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో 15,675 దరఖాస్తులు వచ్చాయి.
ధర్మారం మండలం రామయ్యపల్లెలో <<14895086>>తమ్ముడిపై <<>>అన్న దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. తండ్రి మల్లయ్య శంకరయ్యకు, లింగయ్యకు 12 గుంటల భూమిని సమానంగా పంచాడు. ఈ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. నిన్న శంకరయ్య కుమారుడు బాలయ్యకు లింగయ్యకు పొలం సరిహద్దుల విషయంలో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న శంకరయ్య లింగయ్యపై కట్టెలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదైంది.
జగిత్యాల జిల్లాలోని స్వామి వివేకానంద స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ మండలాల నుంచి ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీలలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ తదితర క్రీడలు ఉంటాయని వ్యాయామ ఉపాధ్యాయుడు విశ్వప్రసాద్ తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.