India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కోనరావుపేట మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ జగిత్యాల జిల్లాలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు.
@ భీమదేవరపల్లి మండలంలో సహారా బాధితుల పాదయాత్ర.
@ కొండగట్టులో గిరి ప్రదక్షణ.
@ సారంగాపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత.
సారంగాపూర్ మండలంలోని కేజీబీవీని ఎమ్మెల్సీ కవిత ఆదివారం సందర్శించారు. కేజీబీవీలో విద్యార్ధినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ హాస్టల్ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, వాటి పట్ల నిర్లక్ష్యం చేయొద్దంటూ అధికారులతో చర్చించారు. ఆమె వెంట జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత ఉన్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* జగిత్యాల జిల్లాలో 35 కేంద్రాల్లో-10,907
* పెద్దపల్లి జిల్లాలో 18 కేంద్రాల్లో- 9,018
* కరీంనగర్ 56 కేంద్రాల్లో 26,977
* సిరిసిల్ల 26 కేంద్రాల్లో 7,163 మంది అభ్యర్థులు నేడు పరీక్ష రాయనున్నారు. సెకన్ ఆలస్యమైన అనుమతించమని అధికారులు తెలిపారు.
ALL THE BEST
కరీంనగర్ జిల్లాలో రేపు ఆదివారం మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల గ్రామంలో పిఎసిఎస్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేధిర గ్రామంలో నూతన పీఐసీఎస్ భవనం గోధాంలను ప్రారంభిస్తారు.
ఈనెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కరీంనగర్ జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి శనివారం నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నందున రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభం.
@ ఇబ్రహీంపట్నం మండలంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు ప్రారంభం.
@ కాటారం మండలంలో అన్నను హత్య చేసిన తమ్ముడు.
@ మెట్పల్లి మండలంలో గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడలో గురుకుల విద్యార్థులతో స్టెప్పులు వేసిన ప్రభుత్వ విప్.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.
పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.
Sorry, no posts matched your criteria.