Karimnagar

News December 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,47,496 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.71,780, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.62,200, అన్నదానం రూ.13,516,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

News December 16, 2024

వెలిచాల జగపతిరావు పై గ్రూప్-2లో ప్రశ్న

image

జిల్లాకు చెందిన మాజీ MLA, మలిదశ తెలంగాణ ఉద్యమ నేత వెలిచాల జగపతిరావుపై గ్రూప్-2లో ప్రశ్నలు వచ్చాయి. పేపర్-4లో 52వ ప్రశ్నగా ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసన సభ్యుల ఫోరం ఏర్పడిందని ప్రశ్న అడిగారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో 1992లో వెలిచాల కన్వీనర్, జానారెడ్డి ఛైర్మన్‌గా తెలంగాణ శాసన సభ్యుల ఫోరాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన 92 మంది MLAల సంతకాలు సేకరించి అప్పటి ప్రధాని PVకి వినతిపత్రం ఇచ్చారు.

News December 16, 2024

KNR: ACBకి చిక్కిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాలుగు మామిడి చెట్లు తరలించడానికి ఎన్‌వోసీపై సంతకం చేయడానికి రూ. 4,500 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

News December 16, 2024

KNR: BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల!

image

BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలపడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన మల్కాజిగిరి MP ఈటల రాజేందర్‌కు అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. BRS, కాంగ్రెస్‌ దూకుడుకు బ్రేక్‌ వేయడానికి ఈటల సరైన వ్యక్తి అనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. ఎంపీగా గెలుపొందడం, బీసీ సామాజికవర్గానికి చెందడం ఈటలకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?

News December 16, 2024

కరీంనగర్: వణుకు పుట్టిస్తున్న చలి!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. చలి ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని గంభీరావుపేటలో 8.6, జూలపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు, యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News December 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ జగిత్యాల జిల్లాలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు.
@ భీమదేవరపల్లి మండలంలో సహారా బాధితుల పాదయాత్ర.
@ కొండగట్టులో గిరి ప్రదక్షణ.
@ సారంగాపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత.

News December 15, 2024

సారంగాపూర్ కేజీబీవీని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

image

సారంగాపూర్ మండలంలోని కేజీబీవీని ఎమ్మెల్సీ కవిత ఆదివారం సందర్శించారు. కేజీబీవీలో విద్యార్ధినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, వాటి పట్ల నిర్లక్ష్యం చేయొద్దంటూ అధికారులతో చర్చించారు. ఆమె వెంట జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత ఉన్నారు.

News December 15, 2024

ప్రారంభమైన కొండగట్టు గిరిప్రదక్షిణ

image

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.

News December 15, 2024

కరీంనగర్: GET READY.. నేడే గ్రూప్-2 పరీక్ష

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* జగిత్యాల జిల్లాలో 35 కేంద్రాల్లో-10,907
* పెద్దపల్లి జిల్లాలో 18 కేంద్రాల్లో- 9,018
* కరీంనగర్ 56 కేంద్రాల్లో 26,977
* సిరిసిల్ల 26 కేంద్రాల్లో 7,163 మంది అభ్యర్థులు నేడు పరీక్ష రాయనున్నారు. సెకన్ ఆలస్యమైన అనుమతించమని అధికారులు తెలిపారు.
ALL THE BEST

News December 15, 2024

రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

image

కరీంనగర్ జిల్లాలో రేపు ఆదివారం మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల గ్రామంలో పిఎసిఎస్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేధిర గ్రామంలో నూతన పీఐసీఎస్ భవనం గోధాంలను ప్రారంభిస్తారు.