Karimnagar

News December 11, 2024

ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు. 

News December 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.

News December 10, 2024

KNR: సోషల్ మీడియా క్రేజ్‌లో యువత చిత్తు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా క్రేజ్‌లో పడి యువత తమ బంగారు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కుటుంబంతో గడపడం కంటే యువత స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని తెలిసిన కొందరు యువతులు లైకులు, కామెంట్ల కోసం ఇటీవల ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

News December 10, 2024

ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ: KNR ఆర్టీసీ RM

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ రాయితీ ఈనెల 1 నుంచి 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

News December 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గంభీరావుపేట మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
@ రాయికల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల డిఎస్పీ.
@ కరీంనగర్ ప్రజావాణిలో 208 ఫిర్యాదులు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్పల్లి మండలం ఆరపేటలో వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు తాజా మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్.

News December 9, 2024

KNR: ప్రజావాణికి 208 దరఖాస్తులు

image

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

News December 9, 2024

వేములవాడ మాజీ MLA రమేశ్‌కు హైకోర్టు షాక్

image

VMWD మాజీ MLA రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వంపై రమేశ్ పిటీషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విషయమై 15.5 ఏళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడంతో హైకోర్టు రమేశ్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, రూ.5 లక్షలు నెలరోజుల్లో కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది.

News December 9, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: KTR

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మేము గతంలో మార్కెట్ కమిటీల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాము, అలాగే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించింది BRS ప్రభుత్వామే అని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలన్నారు.

News December 9, 2024

మంత్రి పొన్నంను కలిసిన బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ సోనియా

image

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన ఆకుల సోనియా ఇటీవల బిగ్‌బాస్ సీజన్-8కి వెళ్లి వచ్చింది. కాగా, నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోనియా మర్యాదపూర్వంగా కలిశారు. తన వివాహానికి హాజరుకావాలని కాబోయే భర్తతో కలిసి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, తదితరులు ఉన్నారు.

News December 9, 2024

ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు

image

ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు వరంగల్ పర్యటన సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 6 గ్యారెంటీల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు.