Karimnagar

News July 17, 2024

కరీంనగర్ జిల్లాలో 36,918కి రుణ మాఫీ

image

కరీంనగర్ జిల్లాలో 36,913 మందికి రుణ మాఫీ కానుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా కరీంనగర్ 2,536 మంది రైతులకు, చొప్పదండి 8,436, హుజురాబాద్ 12,502, మానకొండూర్13,381 మంది రైతులకు రుణమాఫీ కానుంది. రేపు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. మాఫీపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 17, 2024

మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.

News July 17, 2024

PDPL: తాగుడు అపేయాలన్నందుకు యువకుడి సూసైడ్

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. ఎస్సై లక్ష్మణ్ వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన రాజ్ కుమార్(20) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగడం ఆపేయాలని తండ్రి.. కుమారుడిని మందలిస్తూ వస్తున్నాడు. మనస్తాపానికి గురైన రాజ్ కుమార్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 17, 2024

కరీంనగర్: ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు, బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో ఎస్సారెస్పీకి 5,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ 90.323 సామర్థ్యానికి ప్రస్తుతం 13.485 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 22.053 TMCల నీరు ఉంది.

News July 17, 2024

జగిత్యాల్లో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం

image

జగిత్యాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాన్ని భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులను 5రోజుల ముందుగానే తెలుసుకోవచ్చు. వాతావరణాన్ని అంచనా వేసి సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాలు వాతావరణ కేంద్రం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

News July 17, 2024

GDK: అరుణాచల గిరి ప్రదర్శనకు ఆర్టీసీ బస్సు

image

గురుపౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 21న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తులకు TS- RTCగోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు DMనాగభూషణం తెలిపారు. ఈనెల 19న రాత్రి 7 గంటలకు గోదావరిఖనిలో బయలుదేరి కరీంనగర్‌కు చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8:45కు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు www.tsrtconline.inలో సర్వీస్ no.69999 బుక్ చేసుకోవాలన్నారు.

News July 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఎండపల్లి మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ వెల్గటూర్ మండలంలో ఓ ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్. @ ధర్మారం మండలంలో ట్రాక్టర్, బోలెరో డీ.. ఇద్దరి మృతి. @ కోరుట్ల పట్టణంలో ఎరువుల దుకాణాలలో వ్యవసాయ అధికారుల తనిఖీలు. @ బీర్పూర్ మండలంలో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు.

News July 16, 2024

కేంద్రమంత్రి బండికి రాష్ట్రమంత్రి పొన్నం బహిరంగ లేఖ

image

కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చడంలో కేంద్రం నిబద్ధతగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బండి పాత్ర కీలకమని అందులో పేర్కొన్నారు.

News July 16, 2024

పెద్దపెల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అతివేగంగా ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

రాజన్న సన్నిధిలో రేపటి ప్రత్యేక పూజలు ఇవే!

image

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.