Karimnagar

News December 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వెల్గటూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రామగుండంలో ప్రైవేట్ విద్యాలయం ప్రిన్సిపల్ పై దాడి. @ తంగళ్ళపల్లి మండలంలో మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో మాజీ ఎంపీపీ భర్త మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్‌తో మేకలు, గొర్రెలు మృతి. @ మెట్పల్లిలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులు.

News December 8, 2024

సైలెంట్ కిల్లర్ కాదు.. నా శైలిలో ముందుకెళ్తున్నా: శ్రీధర్ బాబు

image

ఐటీ మంత్రిగా తనకు ఎవరితో పోలిక లేదని, తనదైన శైలిలో ముందుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ ఐటీ మంత్రి కంటే మెరుగ్గా పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, తనదైన శైలిలో కృషి చేస్తానని అన్నారు. తమకున్న వనరులతోనే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే తాను సైలెంట్ కిల్లర్ కాదని పనిలో నిమగ్నమవుతానని స్పష్టం చేశారు.

News December 8, 2024

వేములవాడ కోడెల విక్రయం అవాస్తవం: మంత్రి కొండా సురేఖ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రసారమవుతున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

News December 8, 2024

సిరిసిల్ల: నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలి: కలెక్టర్

image

గ్రూప్ 2 అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9వ తేదీన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

News December 8, 2024

SUలో జాబ్‌మేళా.. 427 మందికి ఆఫర్ లెటర్స్

image

KNR శాతవాహన యూనివర్సిటీ లో నిన్న మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2649 మంది అభ్యర్థులు రిజిస్టర్ కాగా 845 మంది షార్ట్ లిస్ట్ అయ్యి 427 మంది కంపెనీల వద్ద నుంచి ఆఫర్ లెటర్లను పొందారు. కాగా జాబ్‌మేళాలో ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులను నిర్వాహకులు, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. ఈ మేళాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

News December 8, 2024

జగిత్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

image

జగిత్యాల జిల్లా బుగ్గారం MPDO గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, తన సిబ్బందితో గడిపిన ఆయన మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్‌లో విషాదం నెలకొంది.

News December 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.

News December 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య. @ వేములవాడలో యారన్ డిపో ప్రారంభం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. @ వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. @ 6 గ్యారెంటీలను అమలు చేసి తీరు తామన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

News December 7, 2024

కాళేశ్వరం: మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

image

వచ్చే సంవత్సరం మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సరస్వతీ పుష్కరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. కరీంనగర్ REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా, ఈ ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు రూ.1,000 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం, ఉమ్మడి జిల్లా రోడ్ల విస్తరణకు రూ.100 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లు ఇంకా మరెన్నో నిధులు తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?