Karimnagar

News December 8, 2024

జగిత్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

image

జగిత్యాల జిల్లా బుగ్గారం MPDO గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, తన సిబ్బందితో గడిపిన ఆయన మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్‌లో విషాదం నెలకొంది.

News December 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.

News December 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య. @ వేములవాడలో యారన్ డిపో ప్రారంభం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. @ వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ. @ 6 గ్యారెంటీలను అమలు చేసి తీరు తామన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

News December 7, 2024

కాళేశ్వరం: మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

image

వచ్చే సంవత్సరం మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సరస్వతీ పుష్కరాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. కరీంనగర్ REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా, ఈ ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు రూ.1,000 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం, ఉమ్మడి జిల్లా రోడ్ల విస్తరణకు రూ.100 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లు ఇంకా మరెన్నో నిధులు తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 7, 2024

పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు డెయిరీ బ్రాండ్ ‘డైరీ ట్రెండ్స్’ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. MSMEలను స్థాపించడానికి తెలంగాణ అద్భుతమైన వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News December 6, 2024

రాజన్నను దర్శించుకున్న 26,928 మంది భక్తులు 

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం 26,928 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కలు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News December 6, 2024

సిరిసిల్ల: అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్

image

హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల మేరకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.

News December 6, 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

image

KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్. @ మహాదేవపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ 36వ సారి అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ ఇల్లంతకుంట మండలంలో చిన్నారిపై పిచ్చికుక్కల దాడి. @ మెట్పల్లి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత.

error: Content is protected !!