Karimnagar

News July 16, 2024

శ్రీవారిసేవలో మాజీ మంత్రి కొప్పుల

image

తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను కొప్పులకు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News July 16, 2024

కరీంనగర్: MSC విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

MSC విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన KNR జిల్లా గంగాధర మం.లో జరిగింది. రామడుగు SI సురేందర్ ప్రకారం.. గర్శకుర్తికి చెందిన మాధవి(23) తల్లి లక్ష్మి ఇటీవల పెద్ద కూతురు ఇంటికి వెళ్లడంతో మాధవి ఒంటరిగా ఉంటోంది. ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలిస్తే పలకకపోవడంతో స్థానికులను పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 16, 2024

కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!

image

KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

News July 16, 2024

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,05,452/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ 54,130/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.32,500/-, అన్నదానం రూ.18,822/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News July 15, 2024

KNR: పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. కరీంనగర్ డివిజన్‌లో 69, పెద్దపల్లి డివిజన్‌లో 60 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

సిరిసిల్ల: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లొ నిందుతులపై 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. సంపత్, పరుశురాం అనే ఇద్దరిని రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News July 15, 2024

KNR: రూ.20 లక్షల అదనపు కట్నం తేవాలని వేధింపులు

image

అదనపు కట్నం తేవాలని వేధించిన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. CI రవి వివరాల ప్రకారం.. జమ్మకుంట మం. మాచనపల్లికి చెందిన స్రవంతి, ఇల్లందకుంట మం.కి చెందిన సదయ్యకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరిత్యా వీరు న్యూజిలాండ్‌లో ఉండి గతేడాది HYDకి వచ్చారు. అయితే రూ.20లక్షల అదనపు కట్నం తేవాలని భార్యను నెలక్రితం పుట్టింటికి పంపాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అత్త, బావతో పాటు.. భర్తపై కేసు నమోదైంది.

News July 15, 2024

KNR: వీడిన మృతదేహం మిస్టరీ

image

ముత్తారం-పారుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుర్రాల వాగు వద్ద వ్యవసాయ బావిలో ఈనెల 8న లభ్యమైన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. మృతదేహం గుర్తించేందుకు మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డకు చెందిన రాజేశ్వరిగా గుర్తించినట్లు మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News July 15, 2024

BREAKING.. జగిత్యాల: పాతకక్షలతో కత్తితో దాడి

image

పాతకక్షలతో కత్తితో దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో చోటుచేసుకుంది. మల్లయ్య అనే వ్యక్తిపై అంజన్న అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 15, 2024

నగర అభివృద్ధికై మంత్రి, సీఎంతో చర్చిస్తా: బండి సంజయ్

image

కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని MP బండి సంజయ్ అన్నారు. ఆదివారం KNRలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు సార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తనను గుర్తించి సన్మానించడం గౌరవంగా ఉందన్నారు. స్మార్ట్‌సిటీ కింద రూ.765 కోట్లు ఇప్పిటికే వచ్చాయని, ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రణాళిక అమలుకు మంత్రి పొన్నం, MLA గంగుల కమలాకర్‌తో పాటు.. CM రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తానని తెలిపారు.