Karimnagar

News January 24, 2025

స్మార్ట్ సిటీ ద్వారా KNR అభివృద్ధి అయ్యిందంటే.. అది బండి సంజయ్ వల్లే: మేయర్

image

స్మార్ట్ సిటీ పై కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు(బీఆర్ఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వల్లే కరీంనగర్‌కు రూ.428 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. 2017లోనే కరీంనగర్ ను ‘స్మార్ట్ సిటీ’గా ఎంపిక చేసినా నిధులు రాలేదు అని తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ అభివృద్ధి అయ్యిందంటే అది బండి సంజయ్ వల్లే అని అన్నారు.

News January 24, 2025

నేడు కరీంనగర్‌కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

image

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్‌ని సందర్శిస్తారు.

News January 23, 2025

UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ

image

విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.

News January 23, 2025

పోచంపల్లి: డివైడర్‌ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్‌కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News January 23, 2025

శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించనున్న మంత్రి పొన్నం

image

రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

News January 23, 2025

కరీంనగర్: స్పౌజ్ కేటగిరికి దరఖాస్తులు

image

స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.

News January 22, 2025

సిరిసిల్ల: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. రుద్రంగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్‌కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.

News January 22, 2025

కరీంనగర్: ఆడపిల్లను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో-బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్బస్టాండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.

News January 22, 2025

UPL లిమిటెడ్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం

image

దావోస్ పర్యటనలో భాగంగా UPL లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ CEO జైదేవ్ శ్రాఫ్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యాధునిక R&D సెంటర్, సీడ్ హబ్ ఏర్పాటు చేయడం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దీర్ఘకాలిక వ్యవసాయాభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

News January 22, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం

image

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్ సేవలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొప్పుల వినోద్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే వివిధ పూజలు, అలాగే వసతి గదిలో వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిట్లు ఆయన తెలిపారు. https://vemulawadatemple.telangana .gov.in/ అనే వెబ్ సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.