Karimnagar

News December 7, 2024

పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు డెయిరీ బ్రాండ్ ‘డైరీ ట్రెండ్స్’ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. MSMEలను స్థాపించడానికి తెలంగాణ అద్భుతమైన వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News December 6, 2024

రాజన్నను దర్శించుకున్న 26,928 మంది భక్తులు 

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం 26,928 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కలు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News December 6, 2024

సిరిసిల్ల: అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్

image

హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల మేరకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.

News December 6, 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

image

KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్. @ మహాదేవపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ 36వ సారి అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ ఇల్లంతకుంట మండలంలో చిన్నారిపై పిచ్చికుక్కల దాడి. @ మెట్పల్లి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత.

News December 5, 2024

పెద్దపల్లి: 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో

image

పెద్దపల్లి జిల్లా ప్రజల చిరకాల కోరిక బస్సు డిపో ఏర్పాటు తీరింది. పెద్దపల్లి పట్టణంలో 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అభిమాన నాయకుడు విజ్జన్న నిరంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని, ఆయన శాసనసభ్యుడిగా గెలవడం వల్లనే ఈరోజు పెద్దపల్లికి బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నాలుగు పోలీస్ స్టేషన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు.

News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి. @ పెద్దపల్లి ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ పెగడపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్ట్. @ బెజ్జంకి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం. @ సిరిసిల్లలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు

News December 4, 2024

రామగుండం, జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం

image

రామగుండం, జైపూర్ రెండు ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పెద్దపల్లి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు చిన్న చిన్న ఉపాధి పనులనే పెద్దగా ప్రచారం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, మేం 11 నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా కొన్ని క్యాలెండర్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.

News December 4, 2024

పెద్దపల్లి: గ్రూప్-4 నియామక పత్రాలు అందజేసిన సీఎం

image

గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం కార్యక్రమంలో భాగంగా నియామక పత్రాలను అందజేసి వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,084 మందికి నియామక పత్రాలు అందజేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

News December 4, 2024

డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి చేయాలి:  సింగరేణి C&MD

image

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్ట్యా సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ C&MD బలరాం ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. అన్ని ఏరియాల GMలతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.