Karimnagar

News July 14, 2024

అవసరమైతే రక్తం దానం చేస్తా: సిరిసిల్ల కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తాను రక్తదానం చేస్తానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా ఆస్పత్రిని శనివారం తనిఖీ చేసి బ్లడ్ బ్యాంకులోని రక్తం నిలువలపై ఆరా తీశారు. తనది ఓ నెగిటివ్ రక్తం అని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తం అందజేస్తానని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు.

News July 14, 2024

8 మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణకు మొండి చేయి: వినోద్ కుమార్

image

8 మంది ఎంపీలను గెలిపించినా BJP తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని BRS నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందన్నారు. అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

News July 13, 2024

హుజూరాబాద్: బీరు సీసాలో పురుగు!

image

హుజూరాబాద్ పట్టణంలోని వైన్ షాపులో ఓ వ్యక్తి బీరు తాగుతుండగా పురుగు వచ్చింది. గమనించి అతడు ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి వైన్ షాపులో చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు వేరే బీర్ ఇచ్చాడు. ఈ విషయం హుజూరాబాద్ పట్టణంలో వైరల్‌గా మారింది.

News July 13, 2024

సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 61 ఏళ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏల స్థానంలో దశాబ్ద కాలంగా విధులు నిర్వహిస్తున్న వారి వారసులను నియమించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు. అనంతరం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

News July 13, 2024

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

News July 13, 2024

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

News July 13, 2024

కరీంనగర్: పెరగనున్న భూముల ధరలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూముల ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. KNR రూరల్ మండలంలోని ఓ రైతు ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. అతడికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.42 వేలకు పైగా ఖర్చయింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెరిగితే కనీసం రూ.60 వేలు ఖర్చవుతుంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి.

News July 13, 2024

KNR: ‘పిల్లల సంరక్షణకు హెల్ప్ డెస్క్’

image

జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల సంరక్షణకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 9490881098తో కూడిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని బాల రక్షాభవన్లో ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ నంబర్‌కు అత్యవసరమైన సమయంలో ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

News July 13, 2024

జగిత్యాల: ‘స్కాలర్షిప్‌కు అప్లై చేసుకోండి’

image

జగిత్యాల జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చదువుతున్న బీడీ కార్మికుల పిల్లలు స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ డా.శ్రీకాంత్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను scholerships.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్ట్ 31 వరకు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు.

News July 13, 2024

కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం 65.39 లక్షలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 35 రోజులకు గాను ఆలయంలో గల 12 హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా నగదు రూ.65 లక్షల 39 వేల 167 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 41 గ్రాముల బంగారం, కిలో 850 గ్రాముల వెండి, 38 విదేశీ కరెన్సీలు వచ్చినట్లు పేర్కొన్నారు.