India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* గ్రూప్4 ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేత
* సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామకపత్రాలు అందజేత
* 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత
* స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు
* డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, సీఎం కప్ ప్రారంభం
* బస్ డిపో, పెద్దపల్లి-సుల్తానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
* కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు ప్రారంభం
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,54,486 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.98,703 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,520, అన్నదానం రూ.12,263,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
దివ్యాంగులు తమలోని దివ్యశక్తిని మేల్కొలిపి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని సంకల్పంతో కృషి చేస్తే వైకల్యం చిన్నబోయి ఫలితం దానంతట అదే వస్తుందన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని.. మంగళవారం కలెక్టరేట్లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లాకు నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. ఈమేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా జీవో జారీ చేశారు. GO 87ద్వారా పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, GO 85 పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, GO 86పెద్దపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, GO 88 ఎలిగేడు పోలీస్ స్టేషన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎలిగేడు మండలమైనా.. ఇన్ని రోజులు జూలపల్లిలోనే పోలీస్ స్టేషన్ కొనసాగింది.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,94,988 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.87,154, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.79,950, అన్నదానం రూ.27,884,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
@ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు. @ జగిత్యాల ప్రజావాణిలో 33 ఫిర్యాదులు. @ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాలలో ట్రాన్స్ జెండర్ ల క్లినిక్లు ప్రారంభం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి పట్టణంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష.
వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మార్గశిర మాసం మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు కొత్తగా పెళ్లయిన భక్తులు కోడలెక్కులు చెల్లించుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయం ముంగట గజ స్థంభ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కేంద్రాలకు అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.
ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగి నేటికి 25 ఏండ్లు గడిచింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీనికి గుర్తుగా మావోయిస్టులు బేగంపేటలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Sorry, no posts matched your criteria.