Karimnagar

News December 1, 2024

KNR: పాఠశాల మధ్యాహ్న భోజనం.. భయపడుతున్న విద్యార్థులు!

image

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలోమధ్యాహ్నం భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే. అలాగే అసిఫాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిమృతి చెందింది. దీంతో జిల్లాలోని సర్కార్ బడుల్లో మధ్యాహ్నం భోజనం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు.

News December 1, 2024

జగిత్యాల: కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు కౌన్సెలింగ్

image

జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు ఆర్డీఓ మధుసూదన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కుమారులతో సమ్మతి పత్రాలు రాయించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆలకొండ రాజవ్వను ఆమె కుమారులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, సఖీ అడ్మిన్ లావణ్య, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News December 1, 2024

పెగడపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అధికారుల కసరత్తు

image

ప్రభుత్వం గ్రామపంచాయతీల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండటంతో పెగడపల్లిలో అధికారులు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా వీటికి సంబంధించి ఓటర్ల జాబితా, గత మూడు టర్ముల సర్పంచులు రిజర్వేషన్లు వార్డు స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసినా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు.

News December 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రేపటినుండి ప్రజాపాలన విజయోత్సవాలు. @ తంగళ్ళపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలలో భక్తుల రద్దీ. @ జగిత్యాల జిల్లాకు 50 మంది కానిస్టేబుల్ల కేటాయింపు. @ మెట్పల్లి పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డిఓ. @ సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

News November 30, 2024

ఇజ్రాయెల్ సహకారంపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం

image

ఇజ్రాయిల్ రాయబారితో మంథని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. మూసీ నది ప్రాజెక్టు పునరుద్ధరణలో సాంకేతిక నైపుణ్యాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. AI, సైబర్‌ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్‌బాబు రిక్వెస్ట్ చేశారు.

News November 30, 2024

REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR

image

మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

News November 30, 2024

జగిత్యాల: తల్లిని తండ్రి కొడుతున్నాడని కొడుకు సూసైడ్

image

జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని KCR కాలనీ వెనుక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన రాకేశ్(20) తల్లి సాయమ్మను తన తండ్రి హనుమంతు తరచూ కొడుతున్నాడు. తాను చనిపోతేనైనా తన తండ్రి తల్లిని కొట్టడం ఆపేస్తాడని అనుకుని కోరుట్ల శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 30, 2024

KNR: డిసెంబర్ 1 నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు: కలెక్టర్

image

డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. విజయోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. విద్యాశాఖ తరఫున విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వైద్య శాఖ తరఫున హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కథలాపూర్ మండలంలో మోడల్ స్కూల్‌ను, వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహాలింగార్చన.
@ ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
@ మెట్ పల్లి పట్టణంలో ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్.
@ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.

News November 29, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్ర వారం రూ.3,09,170 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,173, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,13,510, అన్నదానం రూ.38,487,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

error: Content is protected !!