India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో అత్యధికంగా1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి కి వచ్చారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
@ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్.@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రత అరెస్ట్. @ జగిత్యాల లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసన్నా ఆలయాలను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మెస్ ఛార్జీల బిల్లులను గ్రీన్ చానల్స్ ద్వారా సరఫరా చేస్తామన్నారు.
డిసెంబర్ 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పెద్దపల్లికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని వెల్ఫేర్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్ఛంతో వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో MLAలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ ఉన్నారు.
ప్రజా పాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమం డిసెంబర్ 4వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని సి నారాయణ రెడ్డి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించినున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన మాట్లాడారు. జరగబోయే ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలోమధ్యాహ్నం భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే. అలాగే అసిఫాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిమృతి చెందింది. దీంతో జిల్లాలోని సర్కార్ బడుల్లో మధ్యాహ్నం భోజనం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు.
జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు ఆర్డీఓ మధుసూదన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కుమారులతో సమ్మతి పత్రాలు రాయించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆలకొండ రాజవ్వను ఆమె కుమారులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, సఖీ అడ్మిన్ లావణ్య, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం గ్రామపంచాయతీల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండటంతో పెగడపల్లిలో అధికారులు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా వీటికి సంబంధించి ఓటర్ల జాబితా, గత మూడు టర్ముల సర్పంచులు రిజర్వేషన్లు వార్డు స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసినా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు.
@ రేపటినుండి ప్రజాపాలన విజయోత్సవాలు. @ తంగళ్ళపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలలో భక్తుల రద్దీ. @ జగిత్యాల జిల్లాకు 50 మంది కానిస్టేబుల్ల కేటాయింపు. @ మెట్పల్లి పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డిఓ. @ సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ఇజ్రాయిల్ రాయబారితో మంథని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. మూసీ నది ప్రాజెక్టు పునరుద్ధరణలో సాంకేతిక నైపుణ్యాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. AI, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్బాబు రిక్వెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.