Karimnagar

News July 12, 2024

సిరిసిల్ల: భయపెడుతున్న డెంగ్యూ!

image

ఉమ్మడి KNR వ్యప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి(M)లో డెంగ్యూ కేసు నమోదైంది. ఈ  ఏడాది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నవారి సంఖ్య లెక్కలోకి రావట్లేదు. జిల్లాలో 17 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్‌ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు.

News July 12, 2024

‘అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

image

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శపాఠశాల పనులు సకాలంలో ముగించాలన్నారు. కార్యక్రమములో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

News July 12, 2024

ఇంటింటా ఇన్నోవేషన్ 2024.. ఆగస్టు 3లోగా పంపండి

image

సిరిసిల్లలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఔత్సాహికులు తమ ఆవిష్కరణల వివరాలు ఆగస్టు 3లోగా పంపాలని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. గురువారం తన ఛాంబర్లో ఇంటింటా ఇన్నోవేషన్ 2024 పోస్టర్ ఆవిష్కరించారు. తమ ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల నిడివి వీడియో, 4 ఫోటోలు, పేరు, ఫోన్ నంబర్, వయసు, గ్రామం, జిల్లా పేరు తదితర వివరాలతో 9100678543కు వాట్సాప్ చేయాలన్నారు.

News July 11, 2024

నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటాలి: కలెక్టర్

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో వనమహోత్సవం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయితి, మున్సిపాలిటీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు 15శాతం మొక్కలు మాత్రమే హోం ప్లానిటేషన్ కు కేటాయించాలని, 85 శాతం ఇతర ప్లానిటేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

News July 11, 2024

పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన రామినేని శంకరయ్య(68) పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో 1వ ప్లాట్ ఫారం నుంచి 2వ నంబర్ ప్లాట్ ఫారం వైపు రైల్వే ట్రాక్ పైనుంచి దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టండతో అతడు మృతి చెందినట్టు పేర్కొన్నారు.

News July 11, 2024

తల్లీబిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టండి: కలెక్టర్ పమేలా

image

చిన్నారులు, మహిళల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో వినూత్నంగా శుక్రవారం సభను నిర్వహించాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాలని తెలిపారు. మాతాశిశు మరణాలు తగ్గడానికి పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 11, 2024

పెద్దపల్లి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. దీనికి 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3 మధ్య జన్మించి పెళ్లికాని యువతీ, యువకులు అర్హులని చెప్పారు. జులై 28లోగా https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు వెబ్ సైట్ చూడాలని కోరారు.

News July 11, 2024

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలం: మంత్రి పొన్నం

image

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌కి భంగం కలిగించేలా కిషన్ మాటలు ఉన్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని పొన్నం అన్నారు.

News July 11, 2024

మంత్రిని కలిసిన MLC జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

సిరిసిల్ల: డిప్లమా అగ్రికల్చర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సిరిసిల్ల జిల్లాలో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్(దేశీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. దేశీలో 80 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జిల్లాలోని ఎరువుల విక్రయ, క్రిమిసంహారక లై సెన్స్, పదో తరగతి చదివిన డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు.