Karimnagar

News November 30, 2024

REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR

image

మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

News November 30, 2024

జగిత్యాల: తల్లిని తండ్రి కొడుతున్నాడని కొడుకు సూసైడ్

image

జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని KCR కాలనీ వెనుక ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన రాకేశ్(20) తల్లి సాయమ్మను తన తండ్రి హనుమంతు తరచూ కొడుతున్నాడు. తాను చనిపోతేనైనా తన తండ్రి తల్లిని కొట్టడం ఆపేస్తాడని అనుకుని కోరుట్ల శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 30, 2024

KNR: డిసెంబర్ 1 నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు: కలెక్టర్

image

డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. విజయోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. విద్యాశాఖ తరఫున విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వైద్య శాఖ తరఫున హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కథలాపూర్ మండలంలో మోడల్ స్కూల్‌ను, వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహాలింగార్చన.
@ ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
@ మెట్ పల్లి పట్టణంలో ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్.
@ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.

News November 29, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్ర వారం రూ.3,09,170 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,173, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,13,510, అన్నదానం రూ.38,487,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

News November 29, 2024

సర్వే 100 శాతం పూర్తి చేయాలి: KNR కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల రిత్యా అక్కడక్కడ కొన్ని ఇండ్లు మిగిలిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి సర్వే పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసుకునేందుకు మండల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News November 29, 2024

రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాలింగర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

News November 29, 2024

KNR: రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి: కలెక్టర్ 

image

విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కృషి భవనంలో ఇన్ పుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లమా కోర్సు శిక్షణ తరగతులను ప్రారంభించారు. 40 మంది డీలర్లకు సంవత్సరం పాటు వారానికి ఒకరోజు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.

News November 29, 2024

రేపు రైతు వేదికల్లో సీఎం సభ ప్రత్యక్ష ప్రసారం: కలెక్టర్

image

ఈనెల 30న రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 15 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందన్నారు.

News November 29, 2024

REWIND: కరీంనగర్‌లో KCR అరెస్ట్.. NIMS‌లో దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.