Karimnagar

News November 29, 2024

సర్వే 100 శాతం పూర్తి చేయాలి: KNR కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల రిత్యా అక్కడక్కడ కొన్ని ఇండ్లు మిగిలిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి సర్వే పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసుకునేందుకు మండల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News November 29, 2024

రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాలింగర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

News November 29, 2024

KNR: రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి: కలెక్టర్ 

image

విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కృషి భవనంలో ఇన్ పుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లమా కోర్సు శిక్షణ తరగతులను ప్రారంభించారు. 40 మంది డీలర్లకు సంవత్సరం పాటు వారానికి ఒకరోజు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.

News November 29, 2024

రేపు రైతు వేదికల్లో సీఎం సభ ప్రత్యక్ష ప్రసారం: కలెక్టర్

image

ఈనెల 30న రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 15 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందన్నారు.

News November 29, 2024

REWIND: కరీంనగర్‌లో KCR అరెస్ట్.. NIMS‌లో దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

News November 29, 2024

జగిత్యాల: పోలీస్ సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

image

జగిత్యాల జిల్లాలోని పోలీస్ విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి ప్రశంస ప్రోత్సాహక పత్రాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 29, 2024

రాజన్న ఆలయంలో ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం

image

దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిత్యం వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం కార్తీక మాసం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. రకరకాల ఆకారాలతో భక్తి శ్రద్దలతో దీపాలను వెలిగిస్తున్నారు.

News November 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి.
@ మల్లాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ గొల్లపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్న జగిత్యాల ఎస్పీ.
@ పెగడపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

News November 28, 2024

హుస్నాబాద్ నూతన పురపాలక సంఘానికి బొప్పారాజు పేరు: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్‌లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కలిసి మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్‌లను చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులున్నారు.

News November 28, 2024

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

image

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని ఇదివరకే ఎన్ టి పి సి, బసంత్,నగర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తద్వారా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.

error: Content is protected !!