Karimnagar

News November 29, 2024

జగిత్యాల: పోలీస్ సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

image

జగిత్యాల జిల్లాలోని పోలీస్ విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి ప్రశంస ప్రోత్సాహక పత్రాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 29, 2024

రాజన్న ఆలయంలో ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం

image

దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిత్యం వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం కార్తీక మాసం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. రకరకాల ఆకారాలతో భక్తి శ్రద్దలతో దీపాలను వెలిగిస్తున్నారు.

News November 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి.
@ మల్లాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ గొల్లపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్న జగిత్యాల ఎస్పీ.
@ పెగడపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

News November 28, 2024

హుస్నాబాద్ నూతన పురపాలక సంఘానికి బొప్పారాజు పేరు: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్‌లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కలిసి మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్‌లను చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులున్నారు.

News November 28, 2024

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

image

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని ఇదివరకే ఎన్ టి పి సి, బసంత్,నగర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తద్వారా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.

News November 28, 2024

కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన

image

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

News November 28, 2024

పండగలు మీకు.. పస్తులు రైతులకా?: కేటీఆర్

image

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న రైతు పండగలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా? రైతును నిండా ముంచినందుకా? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా? రైతు పండుగలు అని ప్రశ్నించారు. పండుగలు మీకు.. పస్తులు రైతులకా? అని విమర్శించారు.

News November 28, 2024

కరీంనగర్: చలికాలం జాగ్రత్త!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 28, 2024

KNR: వణికిస్తున్న చలి.. గ్రామాల్లో చలి కాగుతున్న యువత

image

చలి తీవ్రత అధికమవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న చలికి గ్రామాల్లో ఉమ్మడి KNR ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకే చోట గుమికూడి చిన్ననాటి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ చలికాగే రోజులు ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో ఆరు బయట గడ్డి, టైర్లు, కట్టెల మంట వేసుకొని చలి కాగు సేదతీరే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్వకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తోంది.

News November 28, 2024

స్పెల్లింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి ఉత్తం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెల్లింపులు తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.