India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న రైతు పండగలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా? రైతును నిండా ముంచినందుకా? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా? రైతు పండుగలు అని ప్రశ్నించారు. పండుగలు మీకు.. పస్తులు రైతులకా? అని విమర్శించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి తీవ్రత అధికమవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న చలికి గ్రామాల్లో ఉమ్మడి KNR ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకే చోట గుమికూడి చిన్ననాటి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ చలికాగే రోజులు ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో ఆరు బయట గడ్డి, టైర్లు, కట్టెల మంట వేసుకొని చలి కాగు సేదతీరే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్వకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెల్లింపులు తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
@ బుగ్గారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఒకేరోజు ముగ్గురి మృతి.
@ కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వాసుపత్రులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.
@ జగిత్యాల రూరల్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం.
@ మేడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు.
@ తంగళ్లపల్లి మండలంలో కారును ఢీకొన్న లారీ.
సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. KNR జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న రకాల వడ్ల కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.