Karimnagar

News July 11, 2024

మంత్రిని కలిసిన ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

BREAKING.. KNR: ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ప్రయాణికుడు మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటుచేసుకుంది. KNR నుంచి గంగాధరకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతిచెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

గోదావరిఖని: దంత వైద్య విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్

image

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని దంత వైద్య విభాగంలో మొట్ట మొదటిసారిగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించారు. వ్యక్తికి సంబంధించి ముఖంలోని ఆరు దవడ ఎముకలు విరిగిపోవడంతో దంత వైద్య నిపుణులు 6 మినీ ప్లేట్లు, 20 స్క్రూలు బిగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ అభినందించారు.

News July 11, 2024

కాటారం: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన BHPL జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో జరిగింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బస్వాపూరకి చెందిన లింగయ్య(35) రెండున్నర ఎకరాలను రెండేళ్ల క్రితం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట దిగుబడి రాకనోవడంతో రూ.4 లక్షల అప్పయ్యాడు. మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 11, 2024

KNR: రుణ మాఫీ పై ప్రచార లోపం.. రైతన్నలకు శాపం

image

రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోగా ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లించి తిరిగి తీసుకుంటే వడ్డీ బాధ పోయేది. కరీంనగర్ జిల్లాలో 1.34లక్షల మంది రైతులు రుణమాఫీ దారులు ఉండగా అందులో దాదాపు 60వేల మంది వడ్డీ కడుతూ వస్తున్నారు. ఇక రూ.2లక్షల రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన విధివిధానాలపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది.

News July 11, 2024

పెద్దపల్లి: సెప్టిక్ ట్యాంక్‌లో పడిన బాలుడు మృతి.. UPDATE

image

MHBD జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుమారుడు జాన్‌వెస్లీ(7) మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలోని సెప్టిక్ ట్యాంకులో పడిన విషయం తెలిసిందే. బాలుడు తీవ్ర ఆస్వస్థతకు గురికాగా మెరుగైన వైద్యం కోసం KNR ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు బుధవారం మృతి చెందాడు. ట్యాంక్ మూత తెరిచి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేశారు.

News July 11, 2024

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్

image

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్నివర్గాలకు ఉన్నత విద్య అందించడానికి రాజీవ్ గాంధీ వేసిన బాటలు రహదారులుగా మారాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తే .. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇచ్చి డాక్టర్లను, ఇంజనీర్లను చేశారన్నారు.

News July 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ ఓదెల మండలంలో పట్టాలు దాటుతుండగా రైలు తగిలి యువకుడికి గాయాలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. @ జగిత్యాల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీ. @ ఈవీఎం గోదాములను పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్. @ మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్.

News July 10, 2024

కరీంనగర్ జిల్లాలో పురాతన మెట్ల బావి!

image

కరీంనగర్ శివార్లలోని ఎలగందులలో 18వ శతాబ్దానికి చెందిన మెట్లబావి ఉంది. దీనిని నాగన్నబావి అని ఇక్కడి స్థానికులు పిలుస్తుంటారు. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప, ఇక్కడ మెట్ల బావి ఉన్న సంగతి తెలియదు. ఎందుకంటే, నేలమట్టం నుంచి కిందకు 20 మీటర్ల లోతులో బావిని నిర్మించారు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇలాంటి బావులను సంరక్షించి, మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

News July 10, 2024

KNR: గ్రూప్-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి , జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు తమ దరఖాస్తులను వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈనెల 22న మొదలవుతుందన్నారు.