Karimnagar

News July 10, 2024

కరీంనగర్: రుణమాఫీపై కదలిక.. చిగురిస్తున్న ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీపై అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

News July 10, 2024

సిరిసిల్ల: గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడి మృతి

image

గుండెపోటుతో ఓ గల్ఫ్ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేశ్ ఉపాధి నిమిత్తం గత పదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. 6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News July 10, 2024

జగిత్యాల: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాఖాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని(19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 10, 2024

పెద్దపల్లి: ఏడో తరగతి విద్యార్థి మృతి

image

ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. SI సాంబమూర్తి వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలానికి చెందిన సదయ్య కుమారుడు శ్రీవత్సవ్‌(13)కు ఒక కన్ను కనిపించకపోవడంతో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో ఆరేళ్ల క్రితం చేర్పించారు. అయితే బాలుడు
దుస్తులు ఆరవేసే తీగపై ఉన్న టవల్‌ను మెడకు చుట్టుకొని ఆడుకుంటుండగా మరణించినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News July 10, 2024

సమృద్ధిగా కురవని వర్షాలు.. ఆందోళనలో రైతన్నలు

image

సమృద్ధిగా వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవక చెరువులు, బావుల్లో నీరు చేరలేదు. దీంతో రైతులు నాట్లు వేయడానికి ముందుకు రావడం లేదు. KNR మండలంలో 15480 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేసినప్పటికీ 30 శాతం కూడా పంట సాగుకాలేదు. రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తె పోయిన వర్షాలు కురవకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. నీటి సామర్థ్యాన్ని బట్టి రైతులు సాగు చేస్తున్నారు.

News July 10, 2024

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీకి ఇన్‌ఫ్లో 20, 260 క్యూసెక్కులు ఉండగా మంగళవారం ఇన్‌ఫ్లో 35,200 క్యూసెక్కులు పెరిగింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా.. 89.60 మీటర్ల ఎత్తులో వదర ప్రవహిస్తోంది.

News July 10, 2024

జేఎల్ ఫలితాలు.. మెట్‌పల్లి యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు

image

ఇటీవల విడుదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టుల ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. పట్టణంలోని కళానగర్‌కు చెందిన జనమంచి సాయిశిల్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆంగ్ల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. గతంలో 4 ఉద్యోగాలు సాధించిన సాయిశిల్ప.. గురుకుల డిగ్రీ ఆంగ్ల అధ్యాపకురాలు పోస్టుల ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించింది.

News July 10, 2024

KNR: డయేరియా నివారణకు కృషిచేయాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు డయేరియా వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా నివారణకు కృషిచేయాలన్నారు. ఈ వ్యాధి నివారణ తీసుకోవాల్సిన చర్యలపై ప్లాష్ మాబ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.

News July 9, 2024

కరీంనగర్: అంధుల పాఠశాల విద్యార్థి అనుమానస్పద మృతి

image

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.

News July 9, 2024

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానిక సాయినగర్ సాయిబాబా ఆలయం ఎదుట బిక్షాటన చేసే వ్యక్తి మృతిచెందాడు. టూ టౌన్ పోలీసులు వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఎరుపు రంగు డబ్బాల షర్ట్, జీన్ పాయింట్ వేసుకున్నాడు. అతడి వయసు 50 నుంచి 55 ఉండొచ్చిన తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమని సంప్రదించాలని వారు తెలిపారు.