Karimnagar

News November 27, 2024

ఇబ్రహీంపట్నం: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News November 27, 2024

ఇబ్రహీంపట్నం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బ గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. గత 2 నెలలుగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుoడగా ఇష్టం లేదని చెప్పిందనీ, పెండ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాన్ని నిరాకరించలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News November 27, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,79,036 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,81,370 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,245, అన్నదానం రూ.27,421,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News November 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

News November 26, 2024

పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!

image

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 26, 2024

కోరుట్ల: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్

image

NZB జిల్లా న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. NZBకు చెందిన కాంత్రికుమార్‌కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

News November 26, 2024

కరీంనగర్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT

News November 26, 2024

భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం: కరీంనగర్ కలెక్టర్

image

విద్యార్థులకు భాషతో పాటు భావ వ్యక్తీకరణపై అవగాహన చాలా ముఖ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టి.ఈ.డి “స్టూడెంట్స్ టాక్” కార్యక్రమానికి పంపేందుకు గాను జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (దనగర్వాడీ) పాఠశాలలో జరిగింది.

News November 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ ప్రజావాణికి 193 ఫిర్యాదులు. @ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల నిరసన. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికను వేధించిన ఆరుగురికి జైలు శిక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్ల పట్టణంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. @ జగిత్యాల జిల్లాలో ఇద్దరు పాఠశాల ఫుడ్ ఇన్చార్జిల సస్పెండ్. @ మల్లాపూర్ మండలంలో శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన.

News November 25, 2024

పెద్దపల్లి: 1200 ఏళ్ల నాటి శివాలయం! 

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌లో శ్రీ సాంబ సదాశివ ఆలయం ప్రాచీన కాలం నాటిది. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో 16 స్తంభాలతో నిర్మించారు. దాదాపు ఈ గుడికి 1200 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా. గుడి వెనక భాగంలో కొలను ఉంది. అందులో నూరు చిన్న కొలనులు ఉన్నాయని అందుకే ఈ గ్రామానికి కొలనూరు అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.