Karimnagar

News November 24, 2024

జగిత్యాల: 120 మంది శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం

image

జగిత్యాల జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ ద్వారా కలుసుకున్న 120 మంది శ్రీనివాసులు స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో ASI రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 120 మంది శ్రీనివాసులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పరిచయ కార్యాచరణ నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2025లో మొదటివారం శ్రీనివాసులంతా కలిసి నిర్వహించే మహా సభను విజయవంతం చేయాలని కోరారు.

News November 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా దీక్ష దివాస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే

image

ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్ష దివాస్ నిర్వహించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్ష దివాస్ నిర్వహణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. కరీంనగర్ జిల్లాకు MLC బండ ప్రకాశ్, సిరిసిల్ల జిల్లాకు మాజీ MP వినోద్ కుమార్, పెద్దపల్లి జిల్లాకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లాకు మాజీ MLC MD. సలీంను నియమించినట్లు ఆయన తెలిపారు.

News November 24, 2024

వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం భక్తులు ఉదయం నుంచే కోనేటిలో పుణ్యస్నానం ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

News November 24, 2024

దీక్షా దివాస్‌ ఉమ్మడి KNR జిల్లాల ఇన్‌ఛార్జులు వీరే

image

TG రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని BRS శ్రేణులకు మాజీ మంత్రి, సిరిసిల్ల MLA కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. దీక్షా దివాస్‌కు ఉమ్మడి జిల్లాలో
KNR-ప్రకాశ్ ముదిరాజ్ MLC,
SRCL-బోయినపల్లి వినోద్,
PDPL-కొప్పుల ఈశ్వర్,
JGTL-సలీం(MLC)ను ఇన్‌ఛార్జులుగా నియమించారు.

News November 24, 2024

వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి

image

డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.

News November 24, 2024

మంథని: కోటి దీపోత్సవంలో శ్రీధర్ బాబు

image

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతి ఇచ్చిందన్నారు. కార్తీకమాస పూజల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ నిర్వాహకులను అభినందించారు.

News November 24, 2024

జగిత్యాల: మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప

image

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగ పుత్రులకు ఓ అరుదైన చేప చిక్కింది. సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప తులసినగర్‌కి చెందిన గంగపుత్రుడు నవీన్ వలకు చిక్కింది. ఈ చేపను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకు రావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయని నవీన్ తెలిపారు.

News November 24, 2024

KNR: తెలంగాణ దర్శిని కార్యక్రమ సమావేశం

image

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం తెలంగాణ దర్శిని కార్యక్రమంపై పర్యాటక శాఖ కమిటీ సమావేశం కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన నిర్వహించారు. పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు,చారిత్రక ప్రదేశాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం విద్యార్థులను తీసుకెళ్లే పర్యాటక ప్రాంతాల గురించి అధికారులతో చర్చించారు.

News November 24, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.4,63,285 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.2,87,882 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,40,020, అన్నదానం రూ.35,383,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News November 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ చొప్పదండి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. @ గంభీర్రావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్. @ కొడిమ్యాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్.