India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లాలో ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శుక్రవారం 2,18,709 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా 1,11,733 రూపాయలు, ప్రసాదాల ద్వారా 84,090 రూపాయలు, అన్నదానం కోసం 22,886 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
@ మేడిపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చిగురుమామిడి విద్యార్థిని. @ మెట్పల్లి, మల్లాపూర్ మండలాలలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచాలన్న జగిత్యాల కలెక్టర్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
మహిళలు శుక్రవారం సభను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహిళలకు సూచించారు. శుక్రవారంవీణవంక మండలం ఎలబాక గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు, మహిళలకు అన్ని రకాల ఆహార, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, సమస్యలు ఉంటే ఈ సభ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో లారీల మధ్యలో ఇద్దరు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,77,988 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.90,009 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.54,680, అన్నదానం రూ.33,299 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ సిరిసిల్లలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు పశువులు మృతి. @ మానకొండూరు మండలంలో బస్సు, బైక్ డీ.. వ్యక్తీ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జగిత్యాల మండలంలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ. @ సారంగాపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ జగిత్యాలలో దివ్యాంగుల క్రీడలు ప్రారంభం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న రకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో ఇతర పంటలు వేసిన మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు భరోసా రాక, ఇటు బోనస్ రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్ ముగిసిపోయినా ఇప్పటివరకు రైతు భరోసా ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం 30,546 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,85,134 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.90,080 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,820, అన్నదానం రూ.35,234,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
వేములవాడ నిత్య అన్నదాన సత్రానికి రూపాయలు రూ.35 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తన చిరకాల స్వప్నం నిత్యాన్నదానం సత్రం నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.