Karimnagar

News January 6, 2025

కరీంనగర్: మానసాదేవి టెంపుల్.. చాలా స్పెషల్!

image

KNR జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలోని 800ఏళ్లనాటి మానసాదేవి మహాక్షేత్రం ప్రత్యేకమైనది. దేశంలో వెలసిన 2 స్వయంభు ఆలయాల్లో మొదటిది హరిద్వార్‌లో ఉండగా.. రెండోది మన జిల్లాలోనే ఉండటం విశేషం. అమ్మవారు కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారితో పాటు దాదాపు 108 నాగదేవతల విగ్రహాలు ఉన్నాయట. గత ఆరేళ్లలో సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

News January 6, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. @ గంభీరావుపేట మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరికి గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ గంగాధర మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం.

News January 5, 2025

కరీంనగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!

image

కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

News January 5, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 2,70,067 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,30,094 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.69,300, అన్నదానం రూ.70,673 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 5, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రాయికల్ మండలంలో మనస్థాపo తో వ్యక్తి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయ ఈవో గా వేములవాడ ఆలయ ఈవో కు అదనపు బాధ్యతలు. @ జగిత్యాల లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. @ కోరుట్లలో మూడు షాపులలో చోరీ.

News January 4, 2025

పెద్దపల్లి: ఆస్పత్రిలో యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

image

కమాన్‌పూర్ మండలం పేరపల్లికి చెందిన ఆకుల శ్రావణ్(26) గురువారం జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ పరీక్షలు చేసి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ జాయిన్ చేసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావణ్ మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులతో డాక్టర్ చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.

News January 4, 2025

బ్యాడ్మింటన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు

image

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో ఘనంగా సన్మానించారు.

News January 4, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి. @ వేములవాడ బీసీ సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముత్తారం మండలంలో పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం. @ జగిత్యాలలో కొండచిలువను రక్షించిన అటవీశాఖ అధికారులు. @ కోరుట్ల పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

News January 3, 2025

సిరిసిల్ల: ఖేల్ రత్న, అర్జున అవార్డుల గ్రహీతలకు కేటీఆర్ విషెస్

image

ఖేల్ రత్న, అర్జున అవార్డుల‌కు ఎంపికైన‌ క్రీడాకారుల‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జివాంజి, ఏపీకి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజి.. అర్జున అవార్డులకు ఎంపికై తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని దేశం దశదిశలా వ్యాపింపజేసినందుకు మీకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. మరెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరారు.

News January 3, 2025

సిరిసిల్ల: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం వాసి జక్కుల అనూష(18) గురువారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనూష తంగళ్లపల్లి మండలం బద్దనపెల్లిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అనూష తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. 3 రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.