India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.236 కోట్లతో మానేరు రిజర్వాయర్భూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం. రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం, రూ.కోటి 45 లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొనడానికి వేములవాడకు మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. పగటిపూట సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు సూచించారు. చలి తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈనెల 20న సిరిసిల్ల జిల్లాలో జరిగే సీఎం పర్యటనకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బాధ్యత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి మంగళవారం రివ్యూ నిర్వహించారు. సీఎం మొదటగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.
కార్తీక మాసం సందర్భంగా KNR మండలం నగునూర్లోని శ్రీదుర్గాభవాని ఆలయంలో ఈనెల 23న సాయంత్రం కార్తీకమాస లక్ష దీపకాంతుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మన్ తెలిపారు. ఈనెల 23న ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతం, తులసీ కళ్యాణం, సాయంత్రం అమ్మవారికి కార్తీక మాస ప్రయోక్త చతుషష్టి పూజలు, దీపాసంకల్పం, దీపారాధన, మహా మంగళ హారతి అనంతరం లక్షదీపోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు.
మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మంథని మున్సిపాలిటీపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి రివ్యూ నిర్వహించారు. మంథని పట్టణంలో ఉన్న మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య విధులను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
@ పెద్దపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రంలో కొండచిలువ ప్రత్యక్షం.
@ ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెండ్.
@ మల్లాపూర్ మండలంలో మాడల్ స్కూల్ను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి.
@ రేపు వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
@ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,64,514 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,87,294, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.60,850, అన్నదానం రూ.16,370 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం ఆధునీకరణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆడిటోరియంలో లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు పనులను, వేదికను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకుల సీట్ల సంఖ్య, ఏర్పాటు చేయబోయే వివిధ సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు సంబంధించి డివిజనల్ ఇంజినీర్ యాదగిరికి పలు సూచనలు చేశారు.
భూపాపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పలిమల మండలంలోని కామన్పల్లి-ముకునూర్ ప్రధాన రహదారి మధ్యలో కిష్టాపూర్ వద్ద సోమవారం రాత్రి పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఓ పులి పశువులపై దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు విచారణ చేపట్టి స్థానికులను అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.