India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మంథని మున్సిపాలిటీపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి రివ్యూ నిర్వహించారు. మంథని పట్టణంలో ఉన్న మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య విధులను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
@ పెద్దపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రంలో కొండచిలువ ప్రత్యక్షం.
@ ముత్తారం మండలంలో ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెండ్.
@ మల్లాపూర్ మండలంలో మాడల్ స్కూల్ను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి.
@ రేపు వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
@ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,64,514 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,87,294, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.60,850, అన్నదానం రూ.16,370 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం ఆధునీకరణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆడిటోరియంలో లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు పనులను, వేదికను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకుల సీట్ల సంఖ్య, ఏర్పాటు చేయబోయే వివిధ సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు సంబంధించి డివిజనల్ ఇంజినీర్ యాదగిరికి పలు సూచనలు చేశారు.
భూపాపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పలిమల మండలంలోని కామన్పల్లి-ముకునూర్ ప్రధాన రహదారి మధ్యలో కిష్టాపూర్ వద్ద సోమవారం రాత్రి పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఓ పులి పశువులపై దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు విచారణ చేపట్టి స్థానికులను అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు.
@ సీఎం పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్. @ పెద్దపల్లిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. @ రామడుగు పోలీస్ స్టేషన్ ను తనకి చేసిన పోలీస్ కమిషనర్.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని 80,981 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విద్యార్థులు, మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
మద్యం మత్తులో ఆదివారం ఓ వ్యక్తి బాలుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఆడుకుంటున్న గౌస్ బాబా(11) అనే బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన చాంద్ పాషా మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. బాలుడు చాక చక్యంగా తప్పించుకోవడంతో మెడకు గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ తెలిపారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన కట్కూరి సాయి కిరణ్ రెడ్డి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కట్కూరి సుధాకర్ రెడ్డి-అరుణ అనే రైతు దంపతుల కొడుకు సాయి కిరణ్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ -4 ఫలితాల్లో మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు.
Sorry, no posts matched your criteria.