Karimnagar

News July 6, 2024

ఉమ్మడి KNR జిల్లాలో డెంగ్యూ

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతోంది. వర్షాకాలం కావడంతో దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇద్దరికి డెంగ్యూ సోకిందని వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి అనే తండ్రి కొడుకులు డెంగ్యూ వ్యాధితో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు.

News July 6, 2024

సీఎంను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే!

image

సీఎం రేవంత్ రెడ్డిని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తన జన్మదినం సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. జగిత్యాల సమగ్ర అభివృద్దికి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు జగిత్యాల ప్రజల పక్షాన సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

News July 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సిరిసిల్ల జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ,సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవద్దని తెలిపారు.

News July 6, 2024

KNR: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 6, 2024

జమ్మికుంట: 14 ఏళ్లకు పిల్లలను కలిశాడు!

image

జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన సారయ్య- సత్తమ్మ భార్యాభర్తలు. వీరి ఇద్దరి మధ్య 2010లో చిన్న గొడవ జరగగా సత్తమ్మ మృతి చెందింది. దీంతో సారయ్య 14 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు అనాథశ్రమంలో చేరారు. సారయ్య సత్ప్రవర్తన కింద ఈ నెల 3న విడుదలయ్యాడు. అనాథశ్రమంలో ఉన్న పిల్లలను కలిశాడు. పిల్లలను తన వెంట తీసుకెళ్తానని తెలపడంతో ఆశ్రమ నిర్వాహకులు కంటనీరు పెట్టి తండ్రితో పంపించారు.

News July 6, 2024

కరీంనగర్: బాలిక ప్రసవం.. వ్యక్తిపై కేసు నమోదు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలో ఓ బాలిక ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో వరుసకు బావ అయినా వెంకటేశ్ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో బాలిక ఈ నెల 1న వరంగల్ MGM ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు.

News July 6, 2024

KNR: ఈ నెల 7న సివిల్స్ ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష

image

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 7న ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ www.studycircle.cgg.gov.in ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News July 6, 2024

జగిత్యాల జడ్పీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్

image

జగిత్యాల జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌ను జడ్పీ స్పెషల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్, కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News July 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి మండలంలో కుక్క కాటుతో వృద్ధురాలు మృతి. @ ఎండపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ కోరుట్ల శివారులో ట్రాక్టర్, స్కూటీ డీ.. ఒకరి మృతి. @ సైదాపూర్ మండలంలో తేనెటీగల దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ జమ్మికుంటలో భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య. @ జగిత్యాల జిల్లాలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్

News July 5, 2024

కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

image

కరీంనగర్ పరిషత్ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నాటికి ఎంపీటీసీలు, జడ్పీటిసిల పదవీకాలం ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌కు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.