Karimnagar

News November 18, 2024

కరీంనగర్: గ్రూప్ -3 పరీక్షకు 53.39% హాజరు

image

గ్రూప్ -3 పరీక్షకు ఆదివారం కరీంనగర్ జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులకు గాను పేపర్ -1లో 14,104 మంది హాజరు కాగా, 12,311 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.39% హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ -2 లో భాగంగా 26,415 అభ్యర్థుల గాను 14,009 మంది హాజరు కాగా, 12,406 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.03% హాజరైనట్లు తెలిపారు.

News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతం. @ తిమ్మాపూర్ మండలంలో బావిలో పడి వ్యక్తి మృతి. @ బుగ్గారం మండలంలో బావిలో పడి యువకుడి మృతి. @ భీమదేవరపల్లి మండలంలో కారు, బైకు డీ.. రైతు మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల మండలంలో కుమారుని పుట్టినరోజు సందర్భంగా దంపతుల రక్తదానం.

News November 17, 2024

రాజన్న కోవెలలో సామూహిక కార్తీక దీపోత్సవం

image

రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేశ్ ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు 2వ శనివారం నుంచి వచ్చే నెల 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం చేస్తున్నారు. రేవతి, అనిత, సంకీర్తన బృందం వారిచే భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

News November 17, 2024

వేములవాడ రాజన్నను దర్శించుకున్న 50,796 మంది భక్తులు

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ఆదివారం పురస్కరించుకొని 50,796 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

News November 17, 2024

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పూజల వివరాలు ఇవే: ఈవో

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

News November 17, 2024

GREAT.. సిరిసిల్ల: రైతు బిడ్డకు గ్రూప్-4 ఉద్యోగం

image

సిరిసిల్ల జిలా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ రైతు బిడ్డ గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య కుమారుడు రాజ్‌కుమార్‌కు గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగం వదులుకొని పై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. SI ఉద్యోగం మెయిన్స్‌లో 4 మార్కులతో చేజారింది. అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్-4 ఉద్యోగం(రెవెన్యూశాఖ) జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు.

News November 17, 2024

KNR: గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 56 కేంద్రాలు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్‌-3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఈమేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ తిమ్మాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి @ తంగళ్ళపల్లి మండలంలో హార్వెస్టర్, పెళ్లి బస్సు ఢీ.. బస్సు డ్రైవర్‌కు గాయాలు @ వేములవాడలో సీఎం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు. @ కోరుట్లలో పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కి నుంచి లక్ష నగదు చోరీ

News November 16, 2024

KNR: న్యాయం చేయమంటే దాడి చేస్తారా?: బండి సంజయ్

image

ABVP నాయకులపై పోలీసులు, బాసర IIIT సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేస్తారా? బాసరలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? విద్యార్థుల న్యాయమైన డిమాండ్స్ ఎందుకు పరిష్కరించడం లేదని పేర్కొన్నారు.

error: Content is protected !!