India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ సీఎం పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్. @ పెద్దపల్లిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్ష. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. @ రామడుగు పోలీస్ స్టేషన్ ను తనకి చేసిన పోలీస్ కమిషనర్.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని 80,981 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విద్యార్థులు, మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
మద్యం మత్తులో ఆదివారం ఓ వ్యక్తి బాలుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఆడుకుంటున్న గౌస్ బాబా(11) అనే బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన చాంద్ పాషా మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. బాలుడు చాక చక్యంగా తప్పించుకోవడంతో మెడకు గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ తెలిపారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన కట్కూరి సాయి కిరణ్ రెడ్డి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కట్కూరి సుధాకర్ రెడ్డి-అరుణ అనే రైతు దంపతుల కొడుకు సాయి కిరణ్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ -4 ఫలితాల్లో మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు.
గ్రూప్ -3 పరీక్షకు ఆదివారం కరీంనగర్ జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులకు గాను పేపర్ -1లో 14,104 మంది హాజరు కాగా, 12,311 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.39% హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ -2 లో భాగంగా 26,415 అభ్యర్థుల గాను 14,009 మంది హాజరు కాగా, 12,406 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 53.03% హాజరైనట్లు తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతం. @ తిమ్మాపూర్ మండలంలో బావిలో పడి వ్యక్తి మృతి. @ బుగ్గారం మండలంలో బావిలో పడి యువకుడి మృతి. @ భీమదేవరపల్లి మండలంలో కారు, బైకు డీ.. రైతు మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల మండలంలో కుమారుని పుట్టినరోజు సందర్భంగా దంపతుల రక్తదానం.
రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేశ్ ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు 2వ శనివారం నుంచి వచ్చే నెల 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం చేస్తున్నారు. రేవతి, అనిత, సంకీర్తన బృందం వారిచే భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ఆదివారం పురస్కరించుకొని 50,796 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.