Karimnagar

News July 5, 2024

హుస్నాబాద్‌ను పర్యటక కేంద్రంగా తయారు చేస్తా : మంత్రి పొన్నం

image

హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం, సర్వాయిపేట, వంగర, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 5, 2024

ఎల్లారెడ్డిపేట: ప్రవర్తన మార్చుకోని మహిళకు రూ.50 వేలు జరిమానా

image

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్‌లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.

News July 5, 2024

KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు

image

రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.

News July 5, 2024

కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2024

జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

image

జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 5, 2024

KNR: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన HYD శివారులో జరిగింది. నార్సింగి SI ప్రభాకర్ వివరాలు.. భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన మోహన్ గండిపేటలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్‌గా పనిచేస్తూ పీరంచెరువు భవాని కాలనీలో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్ (21) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 5, 2024

PDPL: పల్లె నుంచి జడ్పీ దాక ప్రత్యేకాధికారుల పాలన!

image

గ్రామ పంచాయతీ, మండల పరిషత్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేక అధికారి చేతిలోకి వెళ్లాయి. ఈ నెల 4 నుంచి జిల్లా, మండల పరిషత్ పాలకవర్గల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న సర్పంచి పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ మండల పరిషత్ అధ్యక్షుడి స్థానంలో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించారు.

News July 5, 2024

ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది: పెద్దపల్లి ఎమ్మెల్యే

image

పదేళ్లలో ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్ష కూడా రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

News July 5, 2024

గడ్కరీతో బండి సంజయ్ కుమార్ భేటీ

image

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి సీఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.

News July 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.
@ వేములవాడలో వైభవంగా మహాలింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
@ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
@ మెట్ పల్లి పట్టణంలో కిరాణ షాపులో మద్యం స్వాధీనం.
@ కొడిమ్యాల మండలంలో తహశీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.