Karimnagar

News November 16, 2024

తిమ్మాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తాడూరి వెంకట్ రెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు బిహారి కూలీలను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటరెడ్డికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News November 16, 2024

కరీంనగర్: కాంగ్రెస్ టికెట్ ఎవరికో?

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిల పేర్లను అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

News November 16, 2024

వేములవాడ, కొండగట్టు నేడు మంత్రి పొన్నం రాక

image

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ఉదయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

News November 16, 2024

పాలకుర్తి: తల్లి కిడ్నీ ఇచ్చినా నిలువని కుమారుడి ప్రాణం

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పొన్నం రాము(35) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో హైదారాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని రాము తల్లి తన కిడ్నీని కొడుక్కి ఇచ్చి వైద్యం చేయించింది. అయినా రాము మృతి చెందాడు. దీంతో తల్లి త్యాగాన్ని తలుచుకుని కుటుంబసభ్యులతో పాటు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

News November 16, 2024

నేడు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

image

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రకటిస్తారని మంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

News November 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. @ వేములవాడలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు. @ మెట్పల్లి మండలంలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్. @ ఇబ్రహీంపట్నం మండలంలో మాజీ సర్పంచ్ భర్తపై అట్రాసిటీ కేసు నమోదు.

News November 15, 2024

జగిత్యాల: ఆ ఇంట్లో ఉద్యోగాల పంట!

image

జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ఇంట్లో ఉద్యోగాల పంట పండింది. గ్రూప్-4 ఫలితాల్లో పట్టణానికి చెందిన గుర్రం జయంతి వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. అయితే జయంతి అన్న స్కూల్ అసిస్టెంట్, ఒక సోదరి ఎల్ఐసీ ఏఏవో, మరో సోదరి గురుకుల లైబ్రేరియన్ ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా నాన్న రిటైర్డ్ ఉపాధ్యాయులని జయంతి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు తనను ఎంతగానో ప్రోత్సహించారని, వారికి రుణపడి ఉంటానని జయంతి పేర్కొన్నారు.

News November 15, 2024

కరీంనగర్: నేడు డయల్ యువర్ ఆర్ఎం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RM సుచరిత తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రయాణికులు తెలిపిన సమయంలో తమ సమస్యలను లేదా ఫీడ్ బ్యాక్‌ను 9063403511 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.

News November 15, 2024

20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చిస్తారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు.

News November 15, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కరీంనగర్ సీపీ 

image

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి సూచించారు. గురువారం కరీంనగర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో యాక్సిడెంట్ జోన్‌లు, బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులపై పోలీసు అధికారులతో సమీక్షించారు.

error: Content is protected !!