Karimnagar

News November 17, 2024

వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పూజల వివరాలు ఇవే: ఈవో

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా భక్తుల సౌలభ్యార్థం అర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వ దర్శనం, కోడె మొక్కుబడి, భక్తులచే నిర్వహించే అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2024

KNR: కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి!

image

కరీంనగర్ జిల్లాలో ఈ సమయానికి ధాన్యంతో కల కళకళలాడాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రైతులు కోతలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా తాలు పేరిట అధిక కాంట వేయడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. రైతులు నేరుగా రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

News November 17, 2024

GREAT.. సిరిసిల్ల: రైతు బిడ్డకు గ్రూప్-4 ఉద్యోగం

image

సిరిసిల్ల జిలా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ రైతు బిడ్డ గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య కుమారుడు రాజ్‌కుమార్‌కు గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగం వదులుకొని పై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. SI ఉద్యోగం మెయిన్స్‌లో 4 మార్కులతో చేజారింది. అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్-4 ఉద్యోగం(రెవెన్యూశాఖ) జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు.

News November 17, 2024

KNR: గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 56 కేంద్రాలు ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్‌-3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఈమేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 26,415 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ తిమ్మాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి @ తంగళ్ళపల్లి మండలంలో హార్వెస్టర్, పెళ్లి బస్సు ఢీ.. బస్సు డ్రైవర్‌కు గాయాలు @ వేములవాడలో సీఎం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు. @ కోరుట్లలో పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కి నుంచి లక్ష నగదు చోరీ

News November 16, 2024

KNR: న్యాయం చేయమంటే దాడి చేస్తారా?: బండి సంజయ్

image

ABVP నాయకులపై పోలీసులు, బాసర IIIT సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేస్తారా? బాసరలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? విద్యార్థుల న్యాయమైన డిమాండ్స్ ఎందుకు పరిష్కరించడం లేదని పేర్కొన్నారు.

News November 16, 2024

తిమ్మాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తాడూరి వెంకట్ రెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు బిహారి కూలీలను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటరెడ్డికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News November 16, 2024

కరీంనగర్: కాంగ్రెస్ టికెట్ ఎవరికో?

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిల పేర్లను అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

News November 16, 2024

వేములవాడ, కొండగట్టు నేడు మంత్రి పొన్నం రాక

image

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ఉదయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

News November 16, 2024

పాలకుర్తి: తల్లి కిడ్నీ ఇచ్చినా నిలువని కుమారుడి ప్రాణం

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పొన్నం రాము(35) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో హైదారాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని రాము తల్లి తన కిడ్నీని కొడుక్కి ఇచ్చి వైద్యం చేయించింది. అయినా రాము మృతి చెందాడు. దీంతో తల్లి త్యాగాన్ని తలుచుకుని కుటుంబసభ్యులతో పాటు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.