Karimnagar

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

☞JGTL: డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో యువకుడు పై దాడి ☞JMKT: గుంపుల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు☞మల్లాపూర్: బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష☞కమలాపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ☞మద్దికుంటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ☞వీణవంక: చల్లూరు లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని వ్యక్తి మృతి☞మంథనిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా

News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

@ గంగాధర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య@ కమలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు@ ముస్తాబాద్ మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య@ వీణవంక మండలంలో ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని వ్యక్తి మృతి

News December 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,43,740 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.72,782, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.56,640, అన్నదానం రూ.14,318 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

News December 23, 2024

నేటితో 136వ వసంతంలోకి సింగరేణి

image

సింగరేణి అంచెలంచలుగా ఎదుగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నేడు 135 వసంతాలు పూర్తిచేసుకుని 136వ వసంతంలోకి అడిగెడుతోంది. రామగుండంలో 1937 సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్ దక్కన్ కంపెనీతో ఏర్పాటైన ఈ సంస్థ.. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. అప్పటినుంచి ప్రతియేటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News December 23, 2024

సింగరేణి దేశానికి వెలుగులు రాష్ట్రానికి గర్వకారణం: సీఎం

image

తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి, ప్రగతి పథంలో సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.

News December 23, 2024

సింగరేణి వేడుకలకు ముస్తాబైన స్టేడియం

image

సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను అందంగా ముస్తాబు చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు GM లలిత కుమార్ తెలిపారు. సింగరేణి జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఏర్పాట్లను జీఎంతో పాటు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కుటుంబాలు, స్థానికులు హాజరు కావాలన్నారు. 

News December 23, 2024

KNR: అస్త్రా కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి జితేందర్

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్షన్ సెంటర్, ది కాప్ కేఫేలను తెలంగాణ డిజిపి జితేందర్ ప్రారంభించారు. కరీంనగర్ పోలీసుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశామని అన్నారు. అత్యాధునిక హక్కులతో తీర్చిదిద్దిన అస్త్ర ఏసీ కన్వెన్షన్ సెంటర్, ది కప్ కేఫ్ అధికారులకు, సిబ్బందికి ఉపయోగపడతాయన్నారు.

News December 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లిలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
@ కరీంనగర్ జిల్లాలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డిజిపి జితేందర్.
@ గొల్లపల్లి మండలంలో భక్తులతో పోటెత్తిన దొంగ మల్లన్న ఆలయం.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో కొండచిలువ హతం.
@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ జగిత్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.

News December 22, 2024

దళిత స్పీకర్‌పై పేపర్లు విసిరిన ఘనుడు కౌశిక్ రెడ్డి: MLC

image

దళిత స్పీకర్‌పై పేపర్లు విసిరిన ఘనుడు కౌశిక్ రెడ్డి అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. దళితులను మోసం చేసి వారిపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడ్డారు. రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని హుజరాబాద్ నియోజకవర్గం పర్యనలో భాగంగా హెచ్చరించారు.

News December 22, 2024

భరోసాతో మహిళలకు మరింత భద్రత: డీజీపీ జితేందర్

image

కరీంనగర్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంతో మహిళలకు, బాలికలకు మరింత భద్రత కలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా పోలీసు, న్యాయ, వైద్య సేవలు ఒకే గూటి కింద ఉంటాయని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు.