Karimnagar

News December 22, 2024

కరీంనగర్: రేపు డయల్ యువర్ డీఎం

image

డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిపో -2 మేనేజర్ వి.మల్లయ్య తెలిపారు. కావున కరీంనగర్-2 డిపో పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, గంగాధర తదితర మండలాల ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు సెల్ నంబర్ 9959225921 కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.

News December 22, 2024

వీణవంక: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బండారి చేరాలు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టంది. ఈ ప్రమాదం బేతిగల్ శివారులో జరిగింది. తీవ్ర గాయాలైన చేరాలుని చికిత్స నిమిత్తం హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.

News December 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జూలపల్లి మండలంలో విద్యుత్ షాక్‌తో 15 గొర్రెలు మేకలు మృతి.
@ కోరుట్ల మండలంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి.
@ మల్లాపూర్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య.
@ తంగళ్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన మెట్పల్లి కోర్ట్ మెజిస్ట్రేట్.

News December 21, 2024

శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల

image

గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఎలాంటి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఇటీవల జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకెళ్ళారు. శనివారం వీసీ ఉమేష్ కుమార్ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ కి జేఏసీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

News December 21, 2024

సిరిసిల్ల: మరో నేత కార్మికుడి ఆత్మహత్య

image

నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్లలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం BY నగర్‌కు చెందిన నక్క శ్రీనివాస్(41) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా నిన్న మరో నేత కార్మికుడు<<14931601>> దూస గణేశ్ సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే.

News December 21, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,39,961 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,396 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.41,040, అన్నదానం రూ.20,525,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు.

News December 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మేడిపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ ధర్మారం మండలంలో వీధి కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి. @ కాటారం మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. @ కోరుట్లలో మాయమాటలు చెప్పి వృద్ధురాలి బంగారం అపహరణ. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వీణవంక మండలంలో ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్ట్. @ అక్రమ ఇసుక రావాలను అరికట్టాలన్న జగిత్యాల కలెక్టర్.

News December 20, 2024

కరీంనగర్ శిశుగృహ నుంచి శిశువు దత్తత

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న నాలుగు నెలల మగ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా వరంగల్‌కు చెందిన పిల్లలు లేని దంపతులకు శుక్రవారం దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

News December 20, 2024

కేటీఆర్‌కు నిజాయితీ లేదు: మంత్రి సీతక్క

image

ఫార్ములా ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని, తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్‌కు నిజాయితీ లేదని విమర్శించారు.

News December 20, 2024

కరీంనగర్: మొరాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా కొనసాగుతోంది. అయితే 3 రోజుల నుంచి ఈ యాప్ సరిగా పనిచేయడం లేదు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో లబ్ధిదారులు నిలబెట్టి ఫొటో తీసి అప్‌లోడ్ చేసే ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. యాప్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందువల్లే సర్వర్ డౌన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.