Karimnagar

News November 8, 2024

జాతీయ రహదారి భూసేకరణ పూర్తిపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 136 జీ 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెండింగ్ భూసేకరణ త్వరగా ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు.

News November 8, 2024

కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు

image

కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,17,156 యూనిట్ల పరిధిలో మొత్తం 2,76,620 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 566 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 49 లక్షల కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News November 8, 2024

FLASH.. KNR: గోదావరిలో యువకుడు గల్లంతు

image

గోదావరి నదిలో నీట మునిగి యువకుడు గల్లంతైన ఘటన శుక్రవారం మల్లాపూర్ మండలం వివిరావుపేట గోదావరి నదిలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన శ్రీవర్ధన్(18) మేనకోడలు పుట్టు వెంట్రుకల శుభకార్యానికి గోదావరికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సత్యనారాయణ

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుతో వేసిన రేవంత్ రెడ్డి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

News November 8, 2024

సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి KNR జిల్లా నేతలు

image

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎంను కలిసి ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలం పాటు ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.

News November 8, 2024

సింగరేణి: ‘రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి’

image

సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్ణయించింది. ఇంకా 5 మాసాలు ఉన్నప్పటికీ నెలకు 7.63 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయి. సమిష్టిగా ఉద్యోగులు కృషి చేయాలని కోరుతున్నారు.

News November 8, 2024

ఈనెల 10న పెద్దపల్లిలో సదర్ ఉత్సవాలు

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఈనెల 10న సా.4 గంటలకు ఘనంగా సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా యాదవ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. యాదవుల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యాదవ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి తరలి రావాలని కోరారు. మరి ఈ వేడుకలకు మీరు వెళ్తున్నారా? కామెంట్ చేయండి. 

News November 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వెల్గటూర్ మండలంలో వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి.
@ ముత్తారం మండలంలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత.
@ కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ట్రాక్టర్, బస్సు ఢీ.. కార్మికులకు గాయాలు.
@ మెట్పల్లి మండలంలో వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ సమగ్ర కుటుంబ సర్వేను పక్కడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్.
@ ఇబ్రహీంపట్నం మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్.

News November 7, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.1,30,693 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,30,693 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.63,514 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,550, అన్నదానం రూ.23,629 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News November 7, 2024

ఇల్లంతకుంట: పలు బస్సు రూట్ల సమయాల్లో మార్పు

image

కరీంనగర్ నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే పల్లె వెలుగు బస్సు సర్వీసులతో పాటు, కరీంనగర్ ఇల్లంతకుంట జేబీఎస్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ సమయాలను సవరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇటీవల కరీంనగర్ నుంచి వల్లంపట్ల మీదుగా ఇల్లంతకుంటకు నూతన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం, తదితర కారణాల వల్ల బస్సుల వేళలు మార్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు బస్ స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.