Karimnagar

News December 12, 2024

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ 

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి రాజేశ్వర్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News December 12, 2024

మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?: KTR

image

రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? రూ.50 వేల కోట్లు, రూ.65 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా స్టేటస్ Xలో షేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ రూ.22,406 కోట్లు అని ఆర్బీఐ పేర్కొందని అన్నారు. కాకి లెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా అని విమర్శించారు.

News December 12, 2024

కోరుట్ల: 5 నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్

image

కోరుట్లకు చెందిన 5 నెలల చిన్నారి శీలం శ్రీకృతి అరుదైన రికార్డు సాధించింది. 5 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులు, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. అతి చిన్న వయసులో ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంతో చిన్నారిని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి ఛాంబర్‌లో చిన్నారి తల్లిదండ్రులను పావని – వంశీని అభినందించారు.

News December 12, 2024

కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు మాస్టర్ ప్లాన్

image

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది మే 15 నుంచి జరిగే సరస్వతీ పుష్కరాల కోసం అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ రంగ సంస్థ నిపుణులు ఆలయంలో భక్తుల క్యూలైన్లు, వచ్చి పోయే మార్గాలు, రహదారులను పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వీఐపీ, పుష్కర ఘాట్, ప్రధాన రహదారులను సందర్శించారు. ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.

News December 12, 2024

ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణాను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కృత్రిమ మేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని ఆయన తెలిపారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

☞ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్
☞ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్
☞ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కరీంనగర్ కలెక్టర్
☞ హుస్నాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతా జయంతి వేడుకలు
☞ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
☞ ఎల్కతుర్తి: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

News December 11, 2024

KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.

News December 11, 2024

సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12  నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు. 

News December 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.