India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం
ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు నమోదును పరిశీలించారు. బరువు తక్కువున్న పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అదనపు రేషన్ ఇవ్వాలని సూచించారు. పిల్లలు ఎవరైనా అతిగా లేదా తక్కువ బరువుంటే వారిని గుర్తించి KNR ఎన్ఆర్సీ కేంద్రానికి రిఫర్ చేయాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు.

జిల్లాలోని KGBVలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల హాజరు 85 శాతానికి తగ్గకుండా ఉండాలని, క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలని అన్నారు.

కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత అంశంలో భాగంగా మంగళవారం యువ వేదిక బూట్ క్యాంప్ను నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు స్టార్టప్ ఆలోచనలు, నైపుణ్యాలు, స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చారు. ప్రిన్సిపల్ డా.కె.రామకృష్ణ సహా పలువురు అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. దీని ద్వారా యువతలో నాయకత్వం, సృజనాత్మకత పారిశ్రామిక దృక్పథం పెరుగనున్నాయి.

జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

జాతీయ స్థాయిలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్ను మెరుగుపరిచేందుకు యూనిసెఫ్ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో యూనిసెఫ్ బృందంతో ఆమె సమావేశం నిర్వహించారు. పాఠశాలల ర్యాంకింగ్ మెరుగుపరచడంలో యూనిసెఫ్ సహాయం కోరారు. దీనికి స్పందించిన బృందం సభ్యులు, జిల్లాలో విద్య, వైద్యం, అంగన్వాడీ శాఖలలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి 290 దరఖాస్తులు వచ్చాయి. అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వాటి పరిష్కారం కోసం జిల్లా అధికారులకు బదిలీ చేశారు. వివిధ విభాగాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

ట్రాన్స్జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.

కరీంనగర్ మారుతి నగర్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

బెజ్జంకికి చెందిన కోటారి భానుప్రసాద్(19), నరేష్తో కలిసి బైక్పై కరీంనగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజామున <<17014948>>రేణికుంటలో<<>> రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయిబాబా గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై భాను ప్రసాద్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.