Karimnagar

News November 2, 2024

మంథని: మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

image

మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, బల్మూరు వెంకట్‌కు ఎమ్మెల్సీ పదవి రావడం ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

News November 2, 2024

KNR: ‘పెన్షన్, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగులు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ నవంబర్‌లో పెన్షన్, CPRMS (మెడికల్ కార్డు) రెన్యువల్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రామగుండం సింగరేణి యాజమాన్యం పేర్కొంది. సకాలంలో దరఖాస్తులు చేయకపోతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని, హెల్త్ కార్డు వ్యాలిడిటీ ముగుస్తుందని పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News November 2, 2024

హుజురాబాద్ బ్రిడ్జిపై బోల్తాపడ్డ లారీ.. ట్రాఫిక్ జామ్

image

KNR జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లియర్ చేశారు.

News November 2, 2024

పెద్దపల్లి: సమగ్ర కుటుంబ సర్వే ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే విజయవంతం చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సమగ్ర కులాల స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. సమగ్రంగా అన్ని కులాల వారు ఎంత మంది ఏ స్థితిగతులలో ఉన్నారో తెలుసుకుంటుందని అన్నారు.

News November 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రామడుగు మండలంలో కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలికపై వీధి కుక్క దాడి. @ కోరుట్ల లో గంగమ్మ ఆలయంలో చోరీ. @ జగిత్యాలలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ కరీంనగర్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన బీసీ కమిషన్ సభ్యులు@ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్@ జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధం

News November 2, 2024

కరీంనగర్: బీసీ కమిషన్‌కు 213 విజ్ఞప్తులు

image

కరీంనగర్ కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 213 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99 విజ్ఞప్తులు రాగా జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 53 విజ్ఞప్తులు వచ్చాయి. సుమారు 9 గంటల పాటు బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తులను స్వీకరించారు.

News November 1, 2024

కథలాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిఎస్పీ

image

కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మెట్‌పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా.. డిఎస్పీ ఉమామహేశ్వరరావు స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నెలల వారీగా నమోదైన కేసులు, వాటి పరిష్కారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కోరుట్ల సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నారు.

News November 1, 2024

కరీంనగర్: కొనుగోళ్ల ప్రారంభం ఎప్పుడో?

image

కరీంనగర్ జిల్లాలో గత నెల రోజుల క్రితం వరి కోతలు మొదలయ్యాయి. అయితే కొనుగోళ్లు ప్రారంభం కాక.. కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఓ వైపు మబ్బులు కమ్ముకోవడంతో చేసేదేం లేక దళారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. కాగా, ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.

News November 1, 2024

పెద్దపల్లి: నేడు దీపావళి వేడుకలు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు గురువారం ఘనంగా జరగగా.. పలుచోట్ల నేడు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో PDPL జిల్లాలోని పలు చోట్ల వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి కేదారేశ్వర నోమును పవిత్రంగా నోముకుంటారు. స్వాతి నక్షత్రం రావడంతో పెద్ద ఎత్తున నోములు నోముకుంటున్నారు. మరి దీపావళిని మీరు ఎలా జరుపుకున్నారు?

News November 1, 2024

KNR: డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్య

image

డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.