India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు హక్కులపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తెలిపారు. యూ.డి.ఐ.డి కార్డు పొందే విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండల కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో మొదటిరోజు ఇంటర్ మొదటి సం.. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 16,317 మందికి గాను 15,845 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,384 మంది విద్యార్థులకు గాను 2,187 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 669 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన ఆందోళన స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా<<>> పడిన ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఒకేరోజు ముగ్గురు చనిపోయిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పైనంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిఎస్పీ ఉసిరికాయల వెంకటాచలం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు సత్యానందం, పోటు కృష్ణవేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకేరోజు ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} చింతకాని: ప్రొద్దుటూరు గ్రామంలో బోనాల వేడుక ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్కు నీటి విడుదల ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గజవెల్లి ప్రేమ్ సాగర్(సుబ్బు) అన్నం తిన్న తరువాత ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

✓ ఏన్కూర్: టాటా ఏసీ వాహనంలో ACలు, కూలర్లు దగ్ధం ✓ ఖమ్మం: ప్రైవేటు కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ✓ ఫారెస్ట్, ఎండోమెంట్ అధికారులతో Dy.CM సమీక్ష ✓ అశ్వారావుపేట పోలీసుల దురుసు: MRPS ✓ ఖమ్మం: హీటర్ ఆన్ చేస్తుండగా షాక్ తో వ్యక్తి మృతి ✓ ఖమ్మం: బియ్యం వ్యాపారి రూ.2 కోట్లకు ఐపీ దాఖలు ✓ మధిరలో ఎమ్మెల్సీ విజయోత్సవ సంబురాలు ✓ ఖమ్మం: ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించం: పగడాల.

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడికి చెందిన జనబాయి వెంకటేష్ ఆత్మహత్య కేసులో ఇదే మండలం కోటపాడుకు చెందిన బట్ట నాగేశ్వరావును సోమవారం అరెస్టు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చిమ్మపూడికి చెందిన పాపయ్య కుమారుడు వెంకటేష్ను నాగేశ్వరరావు అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపయ్య ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.